New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-26-at-9.05.44-PM.jpeg)
కడపలో గువ్వలచెరువు ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. కారులోని వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను చక్రాయపేట మండలం కొన్నేపల్లి వాసులుగా గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా కథనాలు