Mahesh - Rajamouli Movie update :మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. మహేష్ కు ముగ్గురు ముద్దుగుమ్మలను సెట్ చేసిన జక్కన్న

రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో మహేష్ కు జోడీ వేటలో పడ్డారు జక్కన్న.ముచ్చటగా ముగ్గురు బామలపై దృష్టి పెట్టినట్లు బి టౌన్ టాక్.

New Update
Mahesh - Rajamouli Movie update :మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. మహేష్ కు ముగ్గురు ముద్దుగుమ్మలను సెట్ చేసిన జక్కన్న

SS Rajamouli:సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం ఫినిష్ చేసి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతి తరువాత రాజమౌళి సినిమాతో మళ్లీ సెట్స్ పైకి వెళ్తారు.అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్న ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో మహేష్ కు జోడిగా అలరించనున్న అందాల భామ ఎవరు అనేదానిపై ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

ALSO READ: Venky-Nani Multi-Starrer: త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ, నాని మల్టీస్టారర్ మూవీ!!

మహేష్ బాబుకు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు

ఈ మూవీలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందనీ సమాచారం.ఇప్పటి వరకు రాజమౌళి పాన్ ఇండియా సినిమాలు తీసినా సరే..పాన్ వరల్డ్ స్తాయిలో ఆకట్టుకున్నాయి.కానీ..ఈ మూవీ మాత్రం ముందు నుంచే పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందని క్రేజ్ ఏర్పడింది.మహేష్ కు జోడీగా నటించబోయే హీరోయిన్ కోసం ఇప్పటికే జక్కన్న సెర్చింగ్ మొదలు పెట్టారు.ఈ మేరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకను కలిసి కథా చర్చలు జరిపారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం.బాలీవుడ్ ముద్దుగుమ్మలు అలియాభట్- ప్రియాంక చోప్రా – దీపిక పదుకొనే మహేష్ బాబు తో జత కట్టనున్నారని కూడా ఓ టాక్ నడుస్తోంది. మరి..ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ అనౌన్స్ చేసే వరకు వేచి చూడక తప్పదు..అయితే .ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ..ఇప్పుడు ఇదే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.ఇక..టాలీవుడ్ నుంచి మహేష్ బాబు హిట్ పెయిర్ అయిన పూజా హెగ్డే , రష్మీక లాంటి అందగత్తెలు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ..ఇదొక అడ్వెంచర్స్ థ్రిల్లర్ కాబట్టి హీరోయిన్స్ విషయంలో జక్కన్న కాంప్రమైజ్ అవ్వరు అని అందరికీ తెలిసిందే.

సౌత్ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్

హై స్టాండర్డ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో హాలీవుడ్‌ టెక్నిషియన్స్ తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి , అర్ అర్ అర్ చిత్రాల కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నారు.ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ స్టోరీ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా సాగుతోందని తెలుస్తోంది.

మార్చి నెలలో పూజా కార్యక్రమాలు
.కొత్త ఏడాదిలోనైనా ఈ మూవీ నుంచి అప్డేట్ వస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక..ఈ మూవీ పూజా కార్యక్రమాలు మార్చి నెలలో మొదలు పెట్టబోతున్నారని ఇన్సైడ్ వర్గాల టాక్.

ALSO READ:super star krishna : మహేష్ బాబు ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్!! గుంటూరు కారంలో సూపర్ స్టార్ తో సూపర్ స్టార్ !!

Advertisment
తాజా కథనాలు