BJP: అధ్యక్షుల మార్పు.. బీజేపీ కీలక నిర్ణయం!

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు జిల్లాల అద్యక్షులను మార్చింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాధవ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా భాస్కర్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దినేశ్ పేర్లను ఖరారు చేసింది.

New Update
BJP: అధ్యక్షుల మార్పు.. బీజేపీ కీలక నిర్ణయం!

Telangana BJP : తెలంగాణ బీజేపీ(Telangana BJP) లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో పార్లమెంట్‌ ఎన్నికల(Parliament Elections) జరగనున్న వేళ తెలంగాణలోని పలు జిల్లాల అధ్యక్షులపై వేటు పడింది. మొత్తం 12 జిల్లాల్లో అధ్యక్షుల్ని మార్చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి(Kishan Reddy). పార్టీలో తన మార్క్‌ చూపిస్తున్నారు కిషన్‌ రెడ్డి. కొత్త అధ్యక్షులకు పార్టీ ఆఫీస్‌ నుంచి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం.

కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు

* నిజామాబాద్ - దినేష్ కుమార్
* పెద్దపల్లి - చందుపట్ల సునీల్
* సంగారెడ్డి - గోదావరి అంజిరెడ్డి
* సిద్దిపేట - మోహన్ రెడ్డి
* యాదాద్రి - పాశం భాస్కర్
* వనపర్తి - డి నారాయణ
* వికారాబాద్ - మాధవరెడ్డి
* నల్గొండ - డాక్టర్ వర్షిత్ రెడ్డి
* ములుగు - బలరాం
* మహబూబ్ నగర్ - పీ శ్రీనివాస్ రెడ్డి
* వరంగల్ - గంట రవి
* నారాయణపేట - జలంధర్ రెడ్డి

కొత్తగా నియమితులైన 6 మోర్చాలా అధ్యక్షులు

* ఎస్టీ మోర్చా - కల్యాణ్ నాయక్
* ఎస్సీ మోర్చా - కొండేటి శ్రీధర్
* యువ మొర్చా - మహేందర్
* OBC మోర్చా - ఆనంద్ గౌడ్
* మహిళ మోర్చా - డాక్టర్ శిల్పా
* కిసాన్ మోర్చా - పెద్దోళ్ల గంగారెడ్డి

Also Read : BIG BREAKING : ఘోర ప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి

Advertisment
తాజా కథనాలు