Mallareddy: మల్లారెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్!

లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు మల్కాజ్‌గిరి ఎంపీ పోటీ నుంచి మల్లారెడ్డి కుమారుడు తప్పుకున్నారు.

New Update
Mallareddy: మల్లారెడ్డికి కేసీఆర్ బిగ్ షాక్!

Shambipur Raju as Malkajgiri BRS MP Candidate: మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR). తాజాగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో అభ్యర్థిని ప్రకటించారు. మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు (Shambipur Raju) పేరును ఖరారు చేశారు. ఈ మేరకు మల్కాజ్ గిరి ఎంపీ పోటీ నుంచి మల్లారెడ్డి కుమారుడు తప్పుకున్నారు. అయితే.. ఇటీవల మల్కాజ్ గిరి నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేయనున్నట్లు.. ఇందుకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మల్లారెడ్డి ప్రచారం చేసుకోగా తాజాగా ఆయన కొడుకు పేరును ప్రకటించకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ALSO READ: బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

రేవంత్ దూకుడు.. మల్లారెడ్డికి చుక్కలు..

మల్లారెడ్డికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమి చెందడం ఒక షాక్ అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఇందుకు కారణం గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా ఆయన అక్రమ నిర్మాణాలను రేవంత్ సర్కార్ కూల్చి వేయడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో (Congress) చేరుతాననని చెప్పిన ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం లేదట. మరోవైపు జాతీయ పార్టీ అండ ఉంటుందని భవిస్తూ బీజేపీ నేతలతో సంప్రదింపులు చేశారట మల్లారెడ్డి. తన కుమారుడికి మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరుతానని కూడా అన్నారట. దీనికి బీజేపీ నో చెప్పడంతో చేసేది ఏమి లేక తిరిగి గులాబీ బాస్ కేసీఆర్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయాలపై వివరణ ఇచ్చినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.

ఇటీవల కేసీఆర్ తో భేటీ..

ఇటీవల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఆయన కొడుకు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి నందినగర్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. ఆక్రమణల్లో నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్‌తో చర్చించారు. అలాగే మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారంపై కేసీఆర్ అరా తీసినట్లు సమాచారం. దీనిపై కేసీఆర్ కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని.. తన కొడుక్కి ఎంపీ టికెట్ కూడా అవసరం లేదని ఆయన కేసీఆర్ కు తెలిపినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు