Mouni  Amavasya 2025: మౌని అమావాస్య ఎప్పుడు? ఆరోజు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఏమవుతుంది?

హిందూ పురాణాల ప్రకారం మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యమైన రోజు. అయితే ఈ ఏడాది మౌని అమావాస్య జనవరి 29న అంటే బుధవారం వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున త్రివేణి సంగమంలో అమృత స్నానం చేయడం ద్వారా పూర్వ పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

New Update
mouni  Amavasya 2025

mouni Amavasya 2025

Mouni  Amavasya 2025: మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఈ ఏడాది మౌని అమావాస్య జనవరి 29న అంటే బుధవారం వచ్చింది. మత విశ్వాసాల ప్రకారం, మౌని అమావాస్య రోజున, దేవతలు గంగా తీరంలో నివసిస్తారని నమ్మకం. అయితే ఈ ఏడాది జనవరి 29 మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభంలో అమృత స్నానం జరుగుతుంది. ఈ రోజున త్రివేణి సంగమంలో అమృత స్నానం చేయడం ద్వారా పూర్వ పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా ఉంటుంది. అలాగే పితృ దోషాలు ఉన్నవారు తమ పూర్వీకులకు పూజలు నిర్వహించడానికి ఈరోజును మంచిదిగా భావిస్తారు. కుంభమేళలో మాత్రమే కాదు మౌని అమావాస్య రోజున  ఇతర పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా కూడా  శ్రేయస్సును పొందుతారు. 

  • మౌని అమావాస్య తిథి 
  • అమావాస్య తిథి ప్రారంభం - జనవరి 28, 2025 రాత్రి 07:35 గంటలకు
  • అమావాస్య తిథి ముగింపు - జనవరి 29, 2025 సాయంత్రం 06:05 గంటలకు

మౌని అమావాస్య పూజ ఆచారాలు.. 

  • పవిత్ర స్నానం: మౌని అమావాస్య రోజున, సూర్యోదయానికి ముందు మౌనంగా స్నానం చేయడం  పవిత్రమైనదిగా భావిస్తారు. పవిత్ర నదుల్లో స్నానం చేయడం ద్వారా ఆత్మ పరిశుద్ధమవుతుంది. 
  • మౌన వ్రతం: మౌని అమావాస్య రోజున భక్తులు మౌన వ్రతం పాటిస్తారు. మౌనంగా ఉండడం స్వీయ నియంత్రణకు ప్రతీక.   ఋషులు, సన్యాసుల తపస్సు ధ్యానం జ్ఞాపకార్థం ఈరోజు అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం, సృష్టి ప్రారంభంలో 'మను' (మనుస్మృతి రచయిత) ఈ రోజున తన మౌన ప్రతిజ్ఞను పాటించాడు. అందుకే దీనిని 'మౌని అమావాస్య' అంటారు.
  • ఉపవాసం: మౌని అమావాస్య రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. ఆహారాన్ని పూర్తిగా మానుకుంటారు. కొంతమంది వేయించిన బంగాళాదుంపలు, సామా కీర్ వంటి ప్రత్యేకమైన ఆహారాలు తీసుకొని ఉపవాసాన్ని పాటిస్తారు. 
  • దాన ధర్మాలు: ఈరోజున  దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. పేదవారికి అన్నం, బట్టలు, డబ్బు దానం చేయడం చాలా పుణ్యం కలుగుతుంది. 
  • పూర్వీకుల ఆరాధన: మౌని అమావాస్య నాడు పితృ తర్పణం  (నైవేద్యాలు) చేయడం విశిష్టమైనది. అలాగే ఆవ నూనెతో ఒక దీపాన్ని వెలిగించి.. పూర్వీకులను స్మరిస్తూ రావిచెట్టు కింద ఉంచండి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 Also Read: Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం!

Advertisment
Advertisment
తాజా కథనాలు