Karthika Pournami 2025: నేడే కార్తీక పౌర్ణమి.. ఈ వస్తువులు దానం చేస్తే మీ జన్మ ధన్యం.. ఎన్నో జన్మల పుణ్యఫలం మీ సొంతం!

కార్తీక మాసంలో పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున శివుడు అనుగ్రహం పొందడానికి తప్పకుండా కొన్ని దానాలు చేయాలి. దీపం, వస్త్రం వంటివి దానం చేయడం వల్ల ఎన్నో జన్మల పుణ్యఫలం మీ సొంతం అవుతుందని పండితులు చెబుతున్నారు.

author-image
By Kusuma
New Update
kARTHIKAMASAM

Karthika Pournami 2025

కార్తీక మాసంలో పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున శివుడు అనుగ్రహం పొందడానికి తప్పకుండా కొన్ని దానాలు చేయాలి. వాటివల్ల ఎన్నో జన్మల పుణ్యఫలం మీ సొంతం అవుతుందని పండితులు చెబుతున్నారు. అయితే పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఏయే వస్తువులు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.

దీప దానం

దీపారాధన ఈ పౌర్ణమి నాడు చేయడం చాలా ముఖ్యమైనది. అయితే ఆలయాలలో లేదా పవిత్ర స్థలాలలో దీపాలను ఎవరైతే దానం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది. దీప దానం అంధకారాన్ని తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ దానం మోక్ష ప్రాప్తికి దారి చూపుతుందని పండితులు అంటున్నారు..

వస్త్ర దానం
ఈ పవిత్ర రోజున పేదలకు, బ్రాహ్మణులకు కొత్త వస్త్రాలు దానం చేయాలి. ముఖ్యంగా చలికాలం కాబట్టి దుప్పట్లు లేదా వెచ్చని వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది. ఈ దానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

అన్న దానం
ఆకలితో ఉన్నవారికి అన్న దానం చేయడం గొప్ప పుణ్యం. కార్తీక పౌర్ణమి రోజున అన్నదానం చేస్తే దాతకు ఏ జన్మలోనూ ఆహారం కొరత ఉండదు. ఈ దానం అఖండ సంతోషం కీర్తిని ఇస్తుంది.

తులసి మొక్క దానం
కార్తీక మాసంలో తులసిని పూజిస్తారు. ఈ రోజున తులసి మొక్కను దానం చేయడం అత్యంత పుణ్యకార్యం. తులసి దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఫల దానం
తీపి పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పుణ్య ఫలం కూడా లభిస్తుంది. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎక్కువ మంది ఉపవాసం ఆచరిస్తుంటారు. అలాంటి వారికి పండ్లు దానం చేస్తే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు. 

ఇలా చేస్తేనే..
పుణ్య ఫలం పొందడానికి ఈ దానాలు చిత్తశుద్ధితో చేయాలి. ఉదయం స్నానం చేసి, భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించిన తరువాత, సాయంత్రం దీపారాధన సమయంలో లేదా ఆ రోజు మొత్తంలో పేదవారిని చూసి దానం చేయండి. కేవలం దానం చేస్తే సరిపోదు. దానం చేసే వస్తువు అవసరమైన వ్యక్తికి అందేలా చూసుకోవడం ముఖ్యం. ఇలా చేయడం ద్వారా మీరు కోటి జన్మల పుణ్య ఫలాన్ని పొందుతారని పండితులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు