/rtv/media/media_files/2025/01/03/fIxW2OD6CgdZ03ozaNyj.jpg)
Massage soles with ghee Photograph
Massage Soles: నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వినియోగం మనకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో తప్పనిసరిగా నెయ్యి వాడాలి. ఈ చలికాలంలో కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే నెయ్యితో పాదాలకు మసాజ్ చేయాలి. నెయితో మసాజ్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
నెయ్యితో అరికాళ్లకు మసాజ్..
ఇది కూడా చదవండి: రోజూ ఒక అరటిపండు తింటే బరువు తగ్గుతారా?
అంతే కాదు భుజం నొప్పితో బాధ పడుతుంటే నెయ్యితో అరికాళ్ళకు మసాజ్ చేయాలి. నెయ్యితో మసాజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. నిద్ర లేమి కారణంగా నిద్రపోకపోతే అరికాళ్లకు నెయ్యితో మర్దనా చేయాలి. ఇది రాత్రి బాగా నిద్రపోవడానికి మీకు సహాయ పడుతుంది. ఈ చలికాలంలో మలబద్ధకంతో బాధపడుతుంటే పడుకునే ముందు నెయ్యితో అరికాళ్లకు మసాజ్ చేయాలి.
ఇది కూడా చదవండి: వయసు పెరిగేకొద్దీ బరువు ఎందుకు పెరుగుతుంది?
నెయ్యిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. శీతాకాలంలో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో నెయ్యితో మసాజ్ చేసినప్పుడు, ముడుచుకున్న నాళాలు తెరుచుకుంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పాదాలలో లేదా పై భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటే ఖచ్చితంగా అరికాళ్ళకు నెయ్యితో మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా నెయ్యితో మసాజ్ చేయడం వల్ల జీర్ణ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: రోజూ ఒక అరటిపండు తింటే బరువు తగ్గుతారా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చలికాలంలో ఉదయాన్నే ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి?