ఈ టీతో అనారోగ్య సమస్యలన్నీ పరార్

గ్లాసు నీటిలో అశ్వగంధ పొడి, తులసి ఆకులు వేసి టీ తయారు చేసుకుని తాగడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ముఖ్యంగా మధుమేహం, దగ్గు, జలుబు, ఒత్తిడి వంటి సమస్యల నుంచి బయట పడతారని నిపుణులు చెబుతున్నారు.

New Update
Ashwagandha tea

చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. టీ తాగడం వల్ల మైండ్ రిలీఫ్ అవుతుంది. కానీ ఇందులోని కెఫిన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ టీ, కాఫీల కంటే ఆరోగ్యానికి మేలు చేసే అశ్వగంధ టీని తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాస్త అశ్వగంధ పొడిలో తులసి ఆకులు, కొంచెం నీరు వేసి గోరువెచ్చగా చేసుకోవాలి. అంతే ఇక టీ రెడీ అయినట్లే.

ఇది కూడా చూడండి: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్..

పీరియడ్స్ సమస్య నుంచి..

ఈ అశ్వగంధ టీని డైలీ ఉదయం తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధ టీ తాగడం వల్ల ఒత్తిడి, జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలు, వాపుల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ అశ్వగంధ టీ బాగా ఉపయోగపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ టీని తాగడం వల్ల పొత్తికడుపులో నొప్పి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..

నిద్రలేమితో బాధపడుతున్నవారు రాత్రిపూట ఈ అశ్వగంధ టీని తాగితే బాగా నిద్రపడుతుంది. రోజుకి రెండు సార్లు తాగిన ఆరోగ్యానికి మంచిదే. అయితే ఈ అశ్వగంధ పొడి మార్కెట్లో లభ్యమవుతుంది. రసాయనాలతో తయారు చేసే అశ్వగంధ పొడిని కాకుండా సహజంగా ఉన్న పొడిని కొనుగోలు చేయడం ఉత్తమం.  అలాగే రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు రోజూ తాగితే క్లియర్ అవుతుంది. 

ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చూడండి: పుష్ప-2పై టీడీపీ ఎంపీ ట్వీట్.. వెంటనే డిలీట్

Advertisment
తాజా కథనాలు