Floods: వరదలకు కారణం వాళ్లే..ఆ 12 మంది అధికారులకు 27 ఏళ్ల జైలు!

లిబియాలో గతేడాది రెండు ఆనకట్టలు కూలిన ఘటనలో 12 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు కోర్టు ఆదివారం 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది.దుర్వినియోగం, నిర్లక్ష్యం, విపత్తుకు దారితీసిన తప్పిదాలకు 12 మంది ప్రస్తుత, మాజీ అధికారులను ఆదివారం డెర్నా క్రిమినల్ కోర్టు దోషులుగా పేర్కొంది.

Floods: వరదలకు కారణం వాళ్లే..ఆ 12 మంది అధికారులకు 27 ఏళ్ల జైలు!
New Update

Floods: లిబియాలో గతేడాది రెండు ఆనకట్టలు కూలిన ఘటనలో 12 మంది ప్రస్తుత, మాజీ అధికారులకు కోర్టు ఆదివారం 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆనకట్ట తెగిపోవడం వల్ల వేలాది మంది మరణించారు. తూర్పు లిబియాలో గతేడాది భారీ వర్షాలు కురిశాయి. డెర్నా నగరం వెలుపల ఉన్న రెండు ఆనకట్టలు సెప్టెంబర్ 11న వరద ఉద్ధృతికి తెగిపోయాయి. దీంతో నగరంలో నాలుగింట ఒక వంతు నీట మునిగింది. దీంతో చాలా మంది ప్రజలు సముద్రంలో కొట్టుకుపోయారని అధికారులు వివరించారు.

దేశంలోని టాప్ ప్రాసిక్యూటర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. దుర్వినియోగం, నిర్లక్ష్యం, విపత్తుకు దారితీసిన తప్పిదాలకు సంబంధించి 12 మంది ప్రస్తుత, మాజీ అధికారులను ఆదివారం డెర్నా క్రిమినల్ కోర్టు దోషులుగా పేర్కొంది. దేశంలోని ఆనకట్టల నిర్వహణకు బాధ్యత వహించే నిందితులకు తొమ్మిది నుండి 27 సంవత్సరాల వరకు కోర్టు జైలు శిక్ష విధించింది.

Also read: ఒలింపిక్స్ లో సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీజ!

#criminals #libiya #officers #africa #floods
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe