Leaders Tweet On Ramoji Rao death: మీడియా మొఘల్ రామోజీరావు మరణం పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అన్నారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి… pic.twitter.com/jYHQDFJdxF
— N Chandrababu Naidu (@ncbn) June 8, 2024
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అంటూ సంతాపాన్ని వ్యకంత చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు… pic.twitter.com/QEfjfOuN2E
— Revanth Reddy (@revanth_anumula) June 8, 2024
రామోజీరావు మరణం తనను చాలా బాధపెట్టింది అంటూ సంతాపం తెలియజేశారు ప్రధాని నరేంద్రమోదీ. తెలుగు పత్రికల్లో విప్లవాన్ని తీసుకువచ్చిన గొప్పవ్యక్తి అని పొగిడారు.
The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK
— Narendra Modi (@narendramodi) June 8, 2024
వీరితో పాటూ మెగాస్టార్ చిరంజీవి, జూ.ఎన్టీయార్ తదితరులు కూడా రామోజీరావు మరణానికి సంతాపాన్ని తెలియజేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ వారి కుటుంబ సభ్యలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం ..
దివి కేగింది 🙏💔🙏 ఓం శాంతి 🙏 pic.twitter.com/a8H8t9Tzvf
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024
శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.
‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm
— Jr NTR (@tarak9999) June 8, 2024
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు గారి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సంతాపం ప్రకటించారు.
పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.
శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని… pic.twitter.com/J375vmi2wn
— BRS Party (@BRSparty) June 8, 2024
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ రామోజీ రావు గారు - JanaSena Chief Shri @PawanKalyan #RamojiRao pic.twitter.com/SMgT991MBQ
— JanaSena Party (@JanaSenaParty) June 8, 2024
ONE man with his 50 years of resilience, hardwork and innovation provided employment, livelihood and hope for millions. 🙏🏻🙏🏻
The only way we can pay tribute to Ramoji Rao garu is conferring him with "BHARAT RATNA"
— rajamouli ss (@ssrajamouli) June 8, 2024
Very Saddened to learn about the demise of media doyen & a true visionary Sri Cherukuri Ramoji Rao Garu
Ramoji Garu was a self made man whose story is inspirational. His life & his journey is a testament of how one can achieve great success despite all odds. He has left an…
— KTR (@KTRBRS) June 8, 2024
రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024
Also Read:Ramoji Rao: ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు.. మీడియా మొఘల్ రామోజీరావు