Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. డీజీపీకి ఫిర్యాదు..!

రాజ్‌తరుణ్‌ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని తనకు లావణ్య మెసేజ్ చేయడంతో.. న్యాయవాది రాజేష్ లావణ్యకు రక్షణ కల్పించాలని డిజిపిని కోరారు. ఈ మేరకు రాజేష్ డీజీపీకి ఫిర్యాదు చేశాడు.

New Update
Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. డీజీపీకి ఫిర్యాదు..!

Lawyer Met DGP in Raj Tarun - Lavanya Case : రాజ్‌తరుణ్‌ (Raj Tarun) లావణ్య (Lavanya) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాను చచ్చిపోతున్నానంటూ లాయర్‌, పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య అందర్ని ఒక్కసారిగా టెన్షన్ పెట్టారు. ముందు లాయర్‌తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేశారు. రాజ్‌తరుణ్ లేకుండా తాను బతకలేనని మెసేజ్ చేసిన లావణ్య ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నానంటూ సందేశంలో తెలిపారు.

Also Read : అంబానీ పెళ్ళి వేడుక.. బాలీవుడ్ స్టార్స్ తో మహేష్ సందడి, వీడియో వైరల్!

ఆ మెసేజ్ చూసిన లాయర్ షాక్ అయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో డయల్ 112 నుంచి కూడా నార్సింగ్ పోలీసులకు (Narsingi Police) సమాచారం వచ్చింది. కాగా ఈ విషయంలో సదరు న్యాయవాది తాజాగా డిజిపి ను కలిశారు. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని తనకు లావణ్య మెసేజ్ చేయడంతో.. న్యాయవాది రాజేష్ లావణ్యకు రక్షణ కల్పించాలని డిజిపిని కోరారు. ఈ మేరకు రాజేష్ డీజీపీకి ఫిర్యాదు చేశాడు.

Advertisment
తాజా కథనాలు