🔴Telangana Panchayat Elections 2025 Live: తెలంగాణలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్ డేట్స్!

author-image
By Manoj Varma
New Update
Sarpanch Elections 2025 Final

  • Dec 17, 2025 14:47 IST

    ప్రారంభమైన కౌంటింగ్

    మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.



  • Dec 17, 2025 13:30 IST

    సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం వాయిదా



  • Dec 17, 2025 13:01 IST

    తెలంగాణాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్

    • ఒంటి గంట దాకా నడిచిన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్‌
    • 1గం. క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటేసే అవకాశం
    • 2గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్‌ ప్రక్రియ
    • మరికాసేపట్లో ఓటింగ్‌ శాతంపై రానున్న స్పష్టత



  • Dec 17, 2025 12:59 IST

    ఓటు కోసం వెళ్లి ప్రమాదానికి గురైన దంపతులు

    ములుగు జిల్లా

    • ఓటు కోసం వెళ్లి ప్రమాదానికి గురైన దంపతులు.
    • వెంకటాపూర్ మండలం నర్సాపూర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ కారు.
    • అల్వాల అపర్ణ అక్కడికక్కడే మృతి, భర్త దేవేందర్‌కు గాయాలు.
    • భూపాలపల్లి సింగరేణిలో పనిచేస్తున్న దేవేందర్ స్వగ్రామం నర్సంపేట మండలంలోని గురిజాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి తిరిగి భూపాలపల్లి వెళ్తుండగా ప్రమాదం.
    • మృతదేహాన్ని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
    • కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు.



  • Dec 17, 2025 12:30 IST

    రాష్రవ్యాప్తంగా 60 శాతం పోలింగ్‌

    నిజమాబాద్ 

    • జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్. 

    • 11 గంటల వరకు 53.69 శాతం పోలింగ్ నమోదు. 

    కామారెడ్డి

    • జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. 11 గంటల వరకు 56.71



  • Dec 17, 2025 12:29 IST

    రంగారెడ్డి జిల్లా

    • మంచాల మండలం అస్మత్పూర్ వార్డులో ఉద్రిక్తత.
    • కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం.
    • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.
    • పరస్పరం దాడులు చేసుకున్న రెండు పార్టీల కార్యకర్తలు.



  • Dec 17, 2025 12:28 IST

    11 గంటల వరుకు రాష్రవ్యాప్తంగా 60 శాతం పోలింగ్‌ జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.



  • Dec 17, 2025 11:45 IST

    ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు

    ఖమ్మం జిల్లా 

    • ఏన్కూరు మండల పరిధిలోని కొత్త మేడేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు.
    • గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్.
    • గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు.
    • తమ గ్రామ సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్న ఓటర్లు.
    • కల్లూరు మండలం చెన్నూరులో ఓ ఇంటర్నెట్ దుకాణంలో డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు.
    • 95000 నగదు ను సీజ్ చేసి నిర్వహకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలింపు.
    • సత్తుపల్లి మండలం బెతుపల్లి గ్రామం లో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా గుండెపోటుకు గురైన సత్యనారాయణ(65) అనే వృద్ధుడు.
    • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.



  • Dec 17, 2025 11:44 IST

    ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ

    జగిత్యాల జిల్లా 

    • గొల్లపల్లి మండలకేంద్రంలో ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.



  • Dec 17, 2025 11:44 IST

    7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ శాతం 28.32 శాతం

    జోగులాంబ గద్వాల

    • జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ శాతం 28.32 శాతం 

    • అలంపూర్ 29.00 శాతం 

    • మానవపాడు 23.73 శాతం

    • ఉండవెల్లి 28.81 శాతం

    • ఇటిక్యాల 26.81 శాతం

    • ఎర్రవల్లి 33.16 శాతం

     

    కరీంనగర్

    కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం జగిత్యాల 21.74 

    • పెద్దపల్లి 22.50 శాతం
    • కరీంనగర్ 20.66 శాతం 
    • రాజన్న సిరిసిల్ల 18.69 శాతం



  • Dec 17, 2025 11:07 IST

    నాగర్ కర్నూలు

    • నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా 9 గంటలకు 27% పోలింగ్ అయినట్లు అధికారులు తెలిపారు 

    • ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ బూతు వద్ద భారీ బందోబస్తు

     

    • నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గంలో 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 25.70శాతం పోలింగ్ నమోదు. 
      మండలాల వారీగా.. అచ్చంపేట... 27.45% 
      అమ్రాబాద్...25.26% 
      బల్మూర్... 22.04 
      లింగాల.. 27.16 
      ఉప్పునుంతల ...25.80 
      పదార....25.29

          చారకోండ ....27.73



  • Dec 17, 2025 10:34 IST

    నల్లగొండ జిల్లా

    • మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 29.06 శాతం పోలింగ్ నమోదు



  • Dec 17, 2025 10:34 IST

    9 గంటల వరకు 21.27 శాతం నమోదైన పోలింగ్

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 
    మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 9 గంటల వరకు 21.27 శాతం నమోదైన పోలింగ్.

    వికారాబాద్

    • వికారాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.86 శాతం పోలింగ్ నమోదు



  • Dec 17, 2025 10:27 IST

    పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత

    సూర్యాపేట జిల్లా 

    • నేరేడుచర్ల మండలం ఎల్బీ నగర్, దర్శించర్ల పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత

    • పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వివాదం

    • ఇరు పార్టీల‌ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం



  • Dec 17, 2025 10:18 IST

    తెలంగాణలో రికార్డ్.. ఈ ఊరిలో ఒక్క ఓటుకు రూ.లక్షా 50వేలు

    తెలంగాణలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ నేటితో ముగియనుంది. ఈ సందర్బంగా ఓ గ్రామంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రికార్డు స్థాయిలో డబ్బులు పంపకాలు జరిగాయి. బహుషా ఈ లెక్కన డబ్బులు ఎమ్మెల్యే ఎలక్షన్‌లో కూడా చూసిఉండకపోవచ్చు ఆ గ్రామస్తులు.

    Shankarpalli



  • Dec 17, 2025 10:16 IST

    సంగారెడ్డి జిల్లా

    నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం 

    • నారాయణఖేడ్ 24.08% 
    • కంగ్టి 30.01% 
    • మానూర్ 25.05% 
    • నాగల్ గిద్ద 26.02% 
    • సిర్గాపూర్ 28.04% 
    • కల్హేర్ 26.7%
    • నిజాంపేట్ 20.03%



  • Dec 17, 2025 10:15 IST

    నిజామాబాద్ జిల్లా

    మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 9 గంటల వరకు 23.35 శాతం పోలింగ్ నమోదు.



  • Dec 17, 2025 10:15 IST

    పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి, కలెక్టర్

    వరంగల్ జిల్లా

    నర్సంపేట, నెక్కొండ. చెన్నారావుపేట, ఖానాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన ఆకుపచ్చని హరిత పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద.



  • Dec 17, 2025 09:55 IST

    ఓటేసేందుకు లండన్‌ నుంచి వచ్చి..

    London Student

     

    అబ్దుల్లాపూర్‌ మెట్‌: లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్న విద్యార్థి లవణ్‌ కుమార్‌ తెలంగాణలో జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ఆయన ఓటు వేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.



  • Dec 17, 2025 09:46 IST

    ఉదయం 9 గంటలు.. 24 పోలింగ్ శాతం నమోదు

    • తెలంగాణ లో కొనసాగుతున్న తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
    • 3,752 పంచాయతీలు, 28, 410 వార్డులకు కొనసాగుతున్న పోలింగ్‌
    • ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 పోలింగ్ శాతం నమోదు
    • మధ్యాహ్నాం 1గం. దాకా పోలింగ్‌
    • 2గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్‌
    • సాయంత్రం కల్లా వెలువడనున్న ఫలితాలు
    • వీలైతే ఇవాళే ఉప సర్పంచ్‌ ఎన్నికలు.. కుదరకుంటే రేపే!



  • Dec 17, 2025 09:45 IST

    సూర్యాపేటలో మండలాల వారీగా పోల్ అయిన వివరాలు

    సూర్యాపేట జిల్లా

    • సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి రెండు గంటలలో ( ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు )మండలాల వారీగా పోల్ అయిన వివరాలు శాతంలలో చింతలపాలెం - 26.84 % గరిడేపల్లి - 25.18 % హుజూర్నగర్ - 20.66 % మట్టంపల్లి - 27.74 % మేళ్లచెర్వు - 23.48 % నేరేడుచర్ల - 21.02 % పాలకవీడు - 26.70 %జిల్లాలో పోలింగ్ సరాసరి.. 24.83 %



  • Dec 17, 2025 09:44 IST

    నందిపేటలో పోటెత్తిన ఓటర్లు

    నిజామాబాద్

    • నందిపేటలో పోటెత్తిన ఓటర్లు.
    • ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చిన మహిళా ఓటర్లు.
    • నందిపేట పోలింగ్ కేంద్రంలో 10 వేలకు పైగా ఓటర్లు.
    • జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బారులు తీరిన ఓటర్లు.



  • Dec 17, 2025 09:44 IST

    400 మంది పైగా ప్రచారం చేస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు

    పెద్దపల్లి జిల్లా
     
    • ఓదెల మండల కేంద్రంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 100 మీటర్ల అవతల పెద్ద ఎత్తున 400 మంది పైగా ప్రచారం చేస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు.
    • అభ్యర్థుల మద్దతుదారులు 144 సెక్షన్ ఉల్లంఘించారని ఆరోపణ.
    • ఘటన స్థలానికి చేరుకొని ప్రజలను వెనుకకు పంపిస్తున్న గోదావరిఖని ఏసిపి రమేష్.



  • Dec 17, 2025 08:57 IST

    తెలంగాణ పల్లెల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న మూడో విడత సర్పంచ్ ఎన్నికలు



  • Dec 17, 2025 08:54 IST

    ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు

    జోగులాంబ గద్వాల జిల్లా

    అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు,ఎర్రవల్లి,ఇటిక్యాల, ఉండవెల్లి,అలంపూర్ మండలాలలో మూడో విడత ఎన్నికల్లో 75 గ్రామ పంచాయతీలగాను 7 గ్రామపంచాయతీలో ఏకగ్రీవం కాగా మిగిలిన 68 గ్రామపంచాయతీలో కొనసాగుతున్న పోలింగ్.



  • Dec 17, 2025 08:54 IST

    ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు

    నారాయణపేట జిల్లా

    • మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలంలో ప్రారంభమైన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్.

    • తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న గ్రామస్తులు.



  • Dec 17, 2025 08:53 IST

    ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు

    వనపర్తి జిల్లా

    • పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాలలో మొదలైన మూడో విడత పోలింగ్.



  • Dec 17, 2025 08:53 IST

    ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు

    మహబూబ్‌నగర్ జిల్లా

    • మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జడ్చర్ల బాలానగర్ మండలాల పరిధిలో పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు.

    • నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మూడో విడత స్థానిక సంస్థలోఎన్నికల సందర్భంగా ఉప్పునుంతల మండలం లోని పలు గ్రామాలలో మొదలైన పోలింగ్.



  • Dec 17, 2025 08:48 IST

    తుది విడత ఎన్నికల వివరాలు

     

    • జిల్లాలు- 31
    • మండలాలు- 182
    • నోటిఫికేషన్‌ ఇచ్చిన జీపీలు- 4,159
    • నామినేషన్లు రాని జీపీలు- 11
    • ఏకగ్రీవమైన జీపీలు- 394
    • ఎన్నికలు నిలిచిన జీపీలు- 2
    • పోలింగ్‌ జరిగే జీపీలు- 3,752
    • పోటీలో ఉన్న అభ్యర్థులు- 12,652
    • నోటిఫికేషన్‌ ఇచ్చిన వార్డులు- 36,452
    • నామినేషన్ల రాని వార్డులు- 116
    • ఏకగ్రీవమైన వార్డులు- 7,908
    • ఎన్నికలు నిలిచిన వార్డులు- 18
    • పోలింగ్‌ జరిగే వార్డులు- 28,410
    • పోటీలో ఉన్న అభ్యర్థులు- 75,725
    • పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య- 36,483
    • మొత్తం ఓటర్ల సంఖ్య- 53,06,401

     



  • Dec 17, 2025 07:49 IST

    ఎన్నికల నిర్వహణకు లక్షకు పైగా సిబ్బంది



  • Dec 17, 2025 07:44 IST

    ఉమ్మడి వరంగల్ లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు



  • Dec 17, 2025 07:41 IST

    ములుగు జిల్లా ఏజెన్సీలో అదనపు భద్రత ఏర్పాటు



  • Dec 17, 2025 06:59 IST

    ALERT: చివరి విడత పోలింగ్ ప్రారంభం

    తెలంగాణలో చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామునే 7 గంటలకు పోలింగ్ బూత్‌ల తలుపులు తెరుచుకున్నారు. 3వ దశలో నేడు 4,157 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

     

    BREAKING
    BREAKING

     



  • Dec 17, 2025 06:56 IST

    లాస్ట్‌‌ ఫేజ్‌‌ పంచాయతీ..3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు

    • 3,752 సర్పంచ్​, 28,410 వార్డు స్థానాలకు ఎన్నిక
    •     ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 
    •     లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్.. ఆ వెంటనే విజేతల ప్రకటన
    •     ఇప్పటికే 394 సర్పంచ్​, 7,908 వార్డులు ఏకగ్రీవం
    •     ర్యాలీలు, సభలు, ఊరేగింపులు బంద్.. రేపటి వరకు 163 సెక్షన్ అమలు



  • Dec 17, 2025 06:53 IST

    సర్పంచి బరిలో తల్లీకూతురు



  • Dec 17, 2025 06:53 IST

    22 ఏళ్లకే ఓ యువతి సర్పంచ్



  • Dec 17, 2025 06:53 IST

    మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం



Advertisment
తాజా కథనాలు