Vijayawada : విజయవాడలో భారీ వర్షం... విరిగిపడిన కొండ చరియలు!

భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

New Update
Vijayawada : విజయవాడలో భారీ వర్షం... విరిగిపడిన కొండ చరియలు!

Heavy Rain : భారీ వర్షాలకు విజయవాడ (Vijayawada) లోని మొగల్రాజపురం వద్ద కొండ చరియలు (Landslides) విరిగిపడిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ (Gadde Rama Mohan) ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ దుర్ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినగా..మరో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వీరిలో ఓ బాలిక మృతి చెందినట్లు సమాచారం. పూర్తిగా దెబ్బ తిన్న ఇంట్లో పలువురు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: ఈరోజు పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయంటే!

Advertisment
తాజా కథనాలు