రేవంత్ రక్తం అంతా బీజేపీదే.. ఇక్కడ చోటా మోడీగా మారిండు: కేటీఆర్

రేవంత్ రక్తం అంతా జీజేపీదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. 'రేవంత్ ఇక్కడ చోటా మోడీగా మారిండు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్.. ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిపోయాడు. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయి'అని ఆరోపించారు.

New Update
రేవంత్ రక్తం అంతా బీజేపీదే.. ఇక్కడ చోటా మోడీగా మారిండు: కేటీఆర్

TELANGANA: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పరిపాలన తీరుపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు చేశారు. 100 మీటర్ల లోపల బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం. కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపై దృష్టి పెట్టాలంటూ మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం నిర్వహించగా ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పై సంచలన ఆరోపణలు చేశారు.

నీలాంటి వాళ్ళను మట్టికరిపించింది..
ఈ మేరకు తమపై అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను తమ పార్టీ ప్రస్థానంలో చాలామందిని చూసిందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను వేల మందిని బీఆర్ఎస్ పార్టీ చూసింది. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలామంది నీలీగిన్రు. అయినా రెండున్నర దశాబ్దాలు పార్టీ బలంగా నిలబడి, నీలాంటి వాళ్ళను మట్టికరిపించింది. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్? తెలంగాణ తెచ్చినందుకా? తెలంగాణను డెవలప్ చేసినందుకా? మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా? అని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయని, రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారుతాడన్నారు.

రక్తం అంత జీజేపీదే..
'రేవంత్ రక్తం అంత జీజేపీదే. ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నాడు. స్విట్జర్లాండ్ లో రేవంత్ రెడ్డి అదానితో అలైబలై చేసుకున్నాడు. అదాని రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు, లొగుట్టు బయటపెట్టాలి. రాహుల్ గాంధీ ఏమో అదానీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈరోజు రేవంత్ రెడ్డి ఆదాని కోసం అర్రులు చేస్తున్నాడు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండు. ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దు. స్వయంగా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి.' అని ప్రజలకు సూచించారు కేటీఆర్.

ఇది కూడా చదవండి: Hyderabad : రాజాసింగ్ బెదిరింపుల కేసు.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

కరెంటు బిల్లు సోనియాకు పంపండి.. 
అలాగే సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికల అప్పుడు చెప్పినట్లు గుర్తు చేశారు. కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, 10జన్ పత్ కు పంపించాలని, హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని, ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్నారు. మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు 2500 వెంటనే ఇవ్వాలని అడిగిన కేటీఆర్.. ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి కాంగ్రెస్ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కు ఏరోజు పొత్తు లేదని, భవిష్యత్తులోనూ ఉండదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కేంద్ర మంత్రిగా 5 ఏండ్లలో ఏమీ చేసిండో రేవంత్ రెడ్డి చెప్పాలని అడిగిన ఆయన.. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కిషన్ రెడ్డి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో లిప్ట్ లను జాతికి అకింతం చేశారంటూ సెటైర్లు వేశారు.

గులాబీ జెండాకు ఎదురులేదు..
హైదరాబాద్ లో బీఅర్ఎస్, కేసీఆర్ అద్వర్యంలో 36 ప్లైఒర్లు కడితే.. ఉప్పల్, అంబర్ పేట ప్లై ఒవర్లు పూర్తిచేయలేక రేవంత్ చేతులెత్తెశారన్నారు. అలాగే శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వానికి అపూర్వమైన మద్దతు ఇచ్చిన హైదరాబాద్ నగర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకున్నది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనే, బీఆర్ఎస్ పార్టీ వల్లనే బీజేపీ సీనియర్ నాయకులు హైదరాబాద్ పలు నియోజకవర్గాల్లో పోటీకి వెనుకంజ వేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఎప్పుడు ప్రజాపక్షమే..
ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజాపక్షమే. కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. రైతన్నలకు రైతుబంధు అందడం లేదు. మహిళలకు ఇచ్చిన 2500 రావడం లేదు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు 420 హామీలు అని ప్రజలు గుర్తుంచుకోవాలి. వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడుతామన్నారు.

Advertisment
తాజా కథనాలు