Kolkata Murder: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ మర్డర్.. పోస్ట్‌మార్టంలో భయంకర నిజాలు!

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ మర్డర్ కేసులో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్ ఆమె పెదవులు, గోళ్లు, మెడ, నాభి, ప్రైవేట్ పార్ట్స్‌పై క్రూరంగా దాడిచేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో బయటపడ్డాయి. క్రూరమైన పోర్న్ చిత్రాలు చూస్తూ అతను ఈ ఘోరానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.

Kolkata Murder: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ మర్డర్.. పోస్ట్‌మార్టంలో భయంకర నిజాలు!
New Update

Kolkata Trainee Doctor Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో సంచలనం నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్ (Sanjay) మొదట ఆమెను హత్య చేసి ఆ తర్వాత రేప్ చేసినట్లు పోలీసులు నిర్దారించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఆమె పెదవులు, కళ్లు, గోళ్లు, మెడ, కడుపు, నాభి, నోరు, కుడి చేయి, ఎడమ కాలుపై తీవ్రమైన గాయాలుండటంతోపాటు రక్తస్రావం అయినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్ పట్ల ఆ దుర్మార్గుడు క్రూరంగా ప్రవర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మర్మాంగంనుంచి కూడా చాలా రక్తం కారినట్లు చెప్పారు. ఆమె కేకలు వేస్తుండగా మొదట తలను బలంగా గోడకు కొట్టాడని, దీంతో ఆమె మూర్చపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఆధారాలతోనే ముందుగా యువతిని చంపి, ఆ తర్వాత అత్యాచారం చేసినట్లు అంచనా వేశామని పోలీసులు చెబుతున్నారు.

చెడు అలవాట్లకు బానిసై..
ఇక ఈ మర్డర్ చేసిన సంజయ్ ఇంటికి వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా పడుకున్నట్లు చెప్పారు. ఆ మరుసటి ఉదయం తన బట్టల మీద రక్తపు మరకలు లేకుండా ఉతికేసుకున్న సంజయ్.. షూలను శుభ్రం చేయడం మరిచిపోగా వీటి ఆధారంగానే సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ చాలా రోజుల నుంచి మద్యానికి అలవాటు పడి, చెడు ప్రవర్తన కలిగి ఉన్నాడని, అతని జీవనం విధానం నచ్చకపోవడంతో ముగ్గురు భార్యలు విడిచిపెట్టడంతో నాలుగో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హింసాత్మక పోర్న్ కంటెంట్.. 
అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని నుంచి మరింత డేటాను రాబడుతున్నారు. 'మేము అతని ఫోన్ నుంచి పూర్తి డేటాను బయటకు తీస్తాం. దర్యాప్తు చేస్తున్న సిబ్బంది నుంచి వాంగ్మూలాలను సేకరించాం. నిందితుడు అశ్లీల చిత్రాలకు అలవాటు పడ్డాడు. అతని మొబైల్ ఫోన్‌లోని అశ్లీల కంటెంట్ చాలా హింసాత్మకంగా ఉంది. అదే అతని మానసిక స్థితిని తెలియజేస్తుంది. అలాంటి వాటిని చూడటం అసహజంగా అనిపిస్తోంది' అని పోలీసు అధికారి వివరించారు.

ఇది కూడా చదవండి: AP: మాధురి మంచిది.. ఆమెను వదలను.. భర్త సంచలన కామెంట్స్!

మరోవైపు సంజయ్ ను కఠినంగా శిక్షించాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అతన్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అతడి తల్లి మాలతీ రాయ్ మాత్రం తన కొడుకు నిర్ధోషి అని వాదిస్తోంది. పోలీసుల ఒత్తిడితోనే చేయని నేరం అంగీకరించాడని చెబుతోంది. ఇక ఆగస్టు 18 లోగా పోలీసులు కేసును చేధించలేకపోతే దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

#sanjay-roy #kolkata #kolkata-trainee-doctor-murder-case #crime-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి