2024 ఐపీఎల్(IPL) సీజన్కు జరిగిన మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తీసుకున్న ఓ నిర్ణయం రోహిత్(Rohit Sharma) అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. రానున్న సీజన్కు కెప్టెన్గా రోహిత్ని కాకుండా గుజరాత్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను నియమించడం పట్ల హిట్మ్యాన్ ఫ్యాన్స్ సోషల్మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. కొంతమంది ఏకంగా ముంబై జెర్సీలను తగలబెట్టారు. అయితే ఫ్రాంచైజీ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. అటు ఈ విషయంలో ముంబై ఇండియన్స్ ప్లేయర్లు సైతం అంబానీ ఫ్రాంచైజీ నిర్ణం పట్ల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో సూర్యకుమార్, బుమ్రా చేసిన సోషల్మీడియా పోస్టులు అందుకు ఎగ్జాంపూల్గా నిలుస్తున్నాయి. ఇదే క్రమంలో ముంబై మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్(Kieron Pollard) చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్గా మారింది.
పూర్తిగా చదవండి..Mumbai Indians: రోహిత్కు మద్దతుగా పొలార్డ్ పోస్ట్.. అంబానీ మావకు ఇచ్చి పడేశాడుగా!
వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి గొడుగు భారంగా అనిపిస్తుందని.. అవసరాలు తీరిపోయిన తర్వాత విధేయత కూడా ఇలానే అంతం అవుతుందంటూ పొలార్డ్ చేసిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. ఇది అంబానీ ఫ్రాంచైజీకి చురకలంటించినట్టే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
Translate this News: