Kangana Ranaut : కొన్ని వందల కోట్లు ఇచ్చినా.. ఆ పని మాత్రం చేయను..ఇందులో నాకు ఆమెనే ఆదర్శం: కంగనా!

కంగనా రనౌత్ తాను లతా మంగేష్కర్ లా ఉండాలి అనుకుంటున్నట్లు తన ఇన్‌ స్టాలో రాసుకొచ్చింది. ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా పెళ్లిళ్లలో వేదికల మీద డ్యాన్స్ లు చేయను అంటూ రాసుకొచ్చింది. గతంలో లతా మంగేష్కర్ కూడా ఇలాగే చెప్పారు.

Kangana Ranaut : కొన్ని వందల కోట్లు ఇచ్చినా.. ఆ పని మాత్రం చేయను..ఇందులో నాకు ఆమెనే ఆదర్శం: కంగనా!
New Update

Kangana : ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా స్టేజీ ఎక్కి ఎలాంటి ప్రదర్శనలు ఇవ్వను అంటుంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కంగనా రనౌత్‌(Kangana Ranaut). ఆమె ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ ముఖ్య కారణం ఉంది. అది ఏంటంటే.. భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ(Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్‌(Radhika) ప్రీ వెడ్డింగ్‌ వేడుక మూడు రోజుల క్రితం ఎంతో ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, హాలీవుడ్‌ నుంచి కూడా ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. స్టేజీ ఎక్కి చిందులు కూడా వేశారు. ఆ వేడుకలను చూసిన బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ కంగనా సెటైర్లు వేసింది. అంతేకాకుండా గతంలో గాయని లతా మంగేష్కర్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా ఆమె తన ఇన్‌ స్టా స్టోరీకి యాడ్‌ చేసింది.

అవి ఏంటంటే..మిలియన్ డాలర్లు ఆఫర్‌ చేసినప్పటికీ కూడా పెళ్లిళ్లలో పాటలు పాడేది లేదని లతా మంగేష్కర్ (Latha Mangeshkar) తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్యలను కంగనా గుర్తు చేస్తూ నేను కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆమె బాటలోనే పయనిస్తానని చెప్పింది. అందుకే ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ పెళ్లిళ్లు, అవార్డుల వేడుకలలో ప్రదర్శనలు ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోలేదని చెప్పింది.

అంతేకాకుండా కొన్ని సినిమాల్లో అత్యధిక మొత్తంలో డబ్బులు ఇస్తామని ఐటెం సాంగ్స్‌ చేయాలని కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను అలాంటి వాటికి ఎప్పుడూ దూరంగానే ఉన్నాను... ఉంటున్నాను... ఉంటాను... కూడా అంటూ కంగనా చెప్పుకొచ్చింది. నాకు డబ్బు కంటే కూడా గౌరవమే ముఖ్యమని నమ్ముతాను అంటూ రాసుకొచ్చింది. అందుకే డబ్బులు కట్టలు కట్టలుగా నా వద్దకు వస్తున్నప్పటికీ నేను వద్దు అనుకుని నా పద్దతిలో, నా హద్దుల్లో నేను ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

యువత కూడా అడ్డదారులు, తప్పుడు పద్దతులు ఎంచుకోవడం మంచిది కాదు. ఆ దారిలో వెళ్లాలి అనుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆమె హితవు పలికారు.

అసలు ఇదంతా కంగనా ఇప్పుడెందుకు చెప్పుకొచ్చిందంటే.. అంబానీ ఇంట సంబరాలు ఎంతో వేడుకగా జరిగాయి. అందులో ఎందరో సినీ ప్రముఖులు ఆడిపాడారు. ఈ వేడుకలను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వేడుకలుగా చెప్పుకొవచ్చు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించారు. దీంతో ఈ వేడుకల గురించి కంగనా పరోక్షంగా సెటైర్లు వేసింది.

Also Read : బుచ్చిబాబు మూవీలో రామ్‌ చరణ్ పక్కన దేవర బ్యూటీ.. !

#kangana-ranaut #tollywood #latha-mangeshkar #bollywood
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe