సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని, 75 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని నారాయణస్వామి అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డీబీటీ ద్వారా ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి జరిగిందా..? అని ప్రశ్నించారు. ఏపీలో జగన్ మౌలిక సదుపాయాలతో కూడిన ఇళ్లను నిర్మిస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు ఆ స్థలాలపై విష ప్రచారం చేస్తున్నాయని నారాయణస్వామి మండిపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎక్కడా ఇళ్ల నిర్మాణం జరగలేదని, ఇప్పుడు ప్రభుత్వం కడుతున్న ఇళ్లను చూసి కడుపుమంటతో రగిలిపోతున్నారని అన్నారు. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెనతో పాటు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మద్యం నియంత్రణ ఎన్టీఆర్ చేశారని కొన్ని పత్రికల్లో రాశారని, ఆ తర్వాత అభివృద్ధి కావాలి అంటే మద్యం కావాలని ప్రచారం చేశారని చెప్పారు.
పూర్తిగా చదవండి..AP News: చంద్రబాబుకు ఏమైనా జరిగితే భువనేశ్వరిపైనే అనుమానం: నారాయణస్వామి
ఏపీ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చంపుడు రాజకీయాలు మొదలైంది చంద్రబాబు కుటుంబం నుంచే అని, రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారని, ఏదైనా జరిగితే భార్య భువనేశ్వరిపైనే అనుమానం ఉంటుందని అన్నారు.
Translate this News: