Minister Athishi: తీహార్ జైలులో ఉన్న ఢీల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం మీద మంత్రి అతిషి ఆందోళన వ్యక్తం చేశారు. డయాబెటీస్ ఉన్నవారికి బెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని…ప్రస్తుతం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే వర్రీగా ఉందని అన్నారు. కేజ్రీవాల్ అంతలా బరువు తగ్గిపోవడం చూస్తుంటే ఆయన కోమాలోకి వెళ్ళే అవకాశం ఉందని అతిషి అన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. తీహార్ జైలు అధికారులు బీజేపీ పత్రాలను విడుదల చేస్తోందని ఆమె విమర్శించారు. తీహార్ జైలులో సీఎం ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Delhi: కేజ్రీవాల్కు బెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్: ఆప్ మంత్రి షాకింగ్ ప్రకటన
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం మీద ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే 8.5 కిలోలు తగ్గిపోయారని పార్టీ నేత సంజయ్ సింగ్ అంటుంటే..తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్యం మరింత క్షీణించిందని బెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు మంత్రి అతిషి.
Translate this News: