ఇస్తాంబుల్ను డల్లాస్ చేస్తామన్న కేసీఆర్(kcr).. హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థను కూడా బాగు చేయించలేకపోయారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని అంబర్ పేట, పటేల్ నగర్, ప్రేమ్ నగర్, ముసారంబాగ్ బ్రిడ్జి (Musarambagh Bridge) ప్రాంతాల్లో పాదయాత్రగా వెళ్లిన ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రాంత ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని ప్రభుత్వం అందిస్తున్న సహాయ సౌకర్యాలపై ఆరా తీశారు. వరద బాధితులు తమ సమస్యలను ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. ఆయన బాధితుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్(Hyderabad)లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
పూర్తిగా చదవండి..హైదరాబాద్ను డల్లాస్ చేస్తామన్న కేసీఆర్.. డ్రైనేజీ వ్యవస్థను కూడా బాగు చేయలేకపోయారు
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు పాదయాత్రగా వెళ్లిన ఆయన.. ప్రజల సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు.
Translate this News: