కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 358 మంది మృతి చెందారు. తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న బాధితులను ఆదుకునేందుకు పలువురు సాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కేరళ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందించారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక ప్రభుత్వం.. కేరళకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కొండచరియలు విరిగిపడి ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం 100 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటన చేసింది. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Kerala: వయనాడ్ బాధితులకు అండగా కర్ణాటక.. 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటన
కేరళ కొండచరియలు విరిగి పడి ఇళ్లు కోల్పోయిన వాయనాడ్ బాధితులకు కర్ణాటక ప్రభుత్వం 100 ఇళ్లు కట్టిస్తామని ప్రకటించింది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం అందించారు.
Translate this News: