Kangana Ranaut: వారి కంట్లో పడితే ఖతమే.. కెరీర్ సర్వనాశనం: బాలీవుడ్ దుర్మార్గంపై కంగన ఫైర్! బాలీవుడ్ ఇండస్ట్రీపై కంగనా రనౌత్ మరోసారి దుమ్మెత్తిపోసింది. 'కొంతమంది ఇతరుల టాలెంట్ను చూసి అసూయ పడతారు. ప్రతిభావంతులు తమ కంట్లో పడితే కెరీర్ సర్వ నాశనం చేస్తారు. వారిపై విషప్రచారం చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. నేనే బాధితురాలినే' అంటూ తనదైన స్టైల్లో మండిపడింది. By srinivas 28 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Kangana Ranaut: బీటౌన్ ఫైర్ బ్రాండ్, మండీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీపై దుమ్మెత్తిపోసింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ప్రతిభ ఉన్నవారికి గుర్తింపు ఎన్నటికీ లభించదంటూ ఆసహనం వ్యక్తం చేసింది. కొత్త తరానికి ఎవరూ మద్ధతుగా నిలవరని, నిజాలు మాట్లాడేవారిని ఇండస్ట్రీనుంచి గెంటివేయాలని కుట్రలు చేస్తారని చెప్పింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన.. ఈ లోక్ సభ ఎన్నికల్లో్ తాను విజయం సాధించడం కొందరికి మింగుడుపడట్లేదని ఆరోపించింది. View this post on Instagram A post shared by Zee Music Company (@zeemusiccompany) కంట్లో పడితే కెరీర్ సర్వ నాశనం చేస్తారు.. కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నిజానికి నేను మంచి మనిషిని. అందరితో నూ మర్యాదగా నడచుకుంటా. అయితే కొంతమందికి మాత్రమే నేను సమస్యగా కనిపిస్తాం. మరి ఆ ప్రాబ్లమ్ నాలో ఉందా? లేదా వారిలోనే ఉందా? అనేది ఆలోచించుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఒక నిస్సహాయ ప్రదేశం. టాలెంట్ను చూసి అసూయ పడతారు. ప్రతిభావంతులు తమ కంట్లో పడితే కెరీర్ సర్వ నాశనం చేస్తారు. దారుణంగా విషప్రచారం చేస్తారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని క్రియేట్ చేస్తారు' అంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడింది. ఇక కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందిరా గాంధీ జీవతం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. #bollywood-industry #kangana-ranaut #sensational-allegations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి