Kangana Ranaut : విజయం దిశగా కంగనా రనౌత్‌.. 50 వేల ఓట్ల మెజార్టీతో లీడింగ్‌

హిమాచల్‌ ప్రదేశ్‌లో మండి లోక్‌సభ నుంచి నియోజకవర్గం నుంచి బరిలోకి బాలీవూడ్ నటీ కంగనా రనౌత్‌ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఏకంగా 50,498 ఓట్ల మెజార్టీతో కంగనా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్నారు.

Kangana Ranaut: కంగనా రనౌత్‌కు హైకోర్టు నోటీసులు
New Update

Kangana Leading : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గత కొన్నేళ్ల నుంచి బీజేపీకి మద్దతిస్తూ.. మొదటిసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ (Bollywood) నటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) లో మండి లోక్‌సభ నుంచి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతం ఆమె లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఏకంగా 50,498 ఓట్ల మెజార్టీతో కంగనా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

Also Read: చంద్రబాబుకు మోడీ ఫోన్.. కూటమి విజయంపై ప్రశంసలు!

కంగనారనౌత్‌కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్‌బరిలోకి దిగారు. కౌంటింగ్‌ మొదలైనప్పటి నుంచి మొదటి నుంచే కంగనా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ విజయ దిశగా వెళ్తున్నారు. లీడింగ్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్నారు.

Also read: దేశవ్యాప్తంగా తగ్గిన మోడీ క్రేజ్‌.. యూపీలో భారీ దెబ్బ!

#kangana-ranaut #telugu-news #bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి