కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఒక్క ప్రాజెక్టులోనే ప్రభుత్వ సహకారంతో మేఘా కృష్ణారెడ్డి వేల కోట్ల ప్రజాసొమ్మును దోచుకున్నాడన్న ఆరోపణలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదిక ఆ ఆరోపణలను నిజం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) వేల కోట్ల అవినీతి సొమ్మును తన జేబులో వేసుకుందని స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..Kaleshwaram Project: కాళేశ్వరంలో ‘మేఘా’ అవినీతి రూ.50 వేల కోట్లు.. కాగ్ నివేదికలో సంచలన లెక్కలు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ లెక్కలను పరిశీలిస్తే 'మేఘా' సంస్థ అవినీతిపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం రూ.50 వేల కోట్లకు పైగా ప్రజల సొమ్మును ఆ కంపెనీ కాళేశ్వరం పేరిట దోచుకుందన్న ఆరోపణలు నిజమని కాగ్ నివేదికను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.
Translate this News: