ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కడపలోని కో-పరేటివ్ కాలనీలో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తను సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కడప నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా వెంకటేశ్వర్లు పనిచేస్తున్నాడు. రైటర్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు నిన్న రాత్రి తుపాకీతో ఇంటికొచ్చాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అర్ధరాత్రి సమయంలో తన కుటుంబాన్ని కాల్చి చంపి.. తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒక్కసారిగా అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
పూర్తిగా చదవండి..Kadapa: భార్యా పిల్లలను చంపేసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదే..!!
కడపలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కోపరేటివ్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తను సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కడప 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు హెచ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ దారుణం జరిగింది.
Translate this News: [prisna-google-website-translator]