KA Paul : కిడ్నీ తప్ప అన్ని దోచుకున్నారు.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

ఏపీ అప్పులు తీరాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. టీడీపీ, వైసీపీ పార్టీలు తోడు దొంగలని విమర్శలు గుప్పించారు. బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకి బానిసలని కామెంట్స్ చేశారు.

New Update
KA Paul : కిడ్నీ తప్ప అన్ని దోచుకున్నారు.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

KA Paul Comments : ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) RTV తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఏపీ అప్పులు తీరాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ప్రజా శాంతి పార్టీ(Praja Shanti Party) అధికారంలోకి రావాలన్నారు. విశాఖలో తనను గెలిపించాలని కోరారు. ఈ క్రమంలోనే టీడీపీ(TDP), వైసీపీ(YCP) పార్టీలపై విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు లక్షల కోట్లు దోచుకున్నాయని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ తోడు దొంగలని పేర్కొన్నారు.

Also Read: ఇలా మాట్లాడే దమ్ము జనసేన పార్టీలో ఎవరికైనా ఉందా?: పోతిన మహేష్

రాష్ట్ర ప్రభుత్వం మనిషి కిడ్ని తప్ప అన్ని దోచుకుందని దుయ్యబట్టారు.  ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఏపీ అప్పులు తీరుతాయని, నిరుదోగ్యులకు ఉద్యోగులు వస్తాయని, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకి బానిసలన్నారు. కేఏ పాల్ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ కింది వీడియో చూడండి.

Advertisment
తాజా కథనాలు