ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజుల నుంచి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూ విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై వరుసగా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల వల్ల ఇప్పటికవరకు ఇజ్రాయెల్లో 1300 మందికి పైగా మృతి చెందగా.. గాజాలో దాదాపు 199 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్-పాలస్తీన్ల మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతరవరణానికి ఎప్పుడు ముగింపు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవలే తమ దేశంలోని నిరిమ్ ప్రాంతంలో జరిగిన మరణకాండకు బాధ్యుడైనటువంటి హమాస్ కీలక కమాండర్ బిలాల్ అల్ కేద్రాను అంతం చేసినట్లు ఇజ్రాయెల్ వాయుసేన ప్రకటించింది. ప్రస్తుతం గాజాలో సంక్షోభం నెలకొన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ముందడుగు వేశారు. అటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు.. అలాగే పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్తో చర్చించారు.
పూర్తిగా చదవండి..Israel-Hamas: ఆగని భీకర యుద్ధం.. మానవతా సంక్షోభం నివారణకై అమెరికా ప్రయత్నాలు
ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజుల నుంచి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూ విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై వరుసగా బాంబుల వర్షం కురిపిస్తోంది.
Translate this News: