TGPSC: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్ డేట్ ఫిక్స్!

తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆన్సర్ కీ తోపాటు పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30లోగా అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. 

New Update
TGPSC

TGPSC: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆన్సర్ కీ తోపాటు పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పరీక్షకు హాజరైన లక్షల మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. కటాఫ్ మార్కులతో కూడిన జాబితాను డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. గ్రూప్-3లో 1388 పోస్టుల భర్తీ కోసం కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ను టీజీపీఎస్సీ 2024ని నవంబర్ 17,18న విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా పరీక్ష ఫలితాలు, స్కోర్‌కార్డ్‌లు, కటాఫ్ మార్కులతో సహా డిసెంబర్ 30లోపు అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచనుంది. 

ఎలా చెక్ చేసుకోవాలంటే..

అభ్యర్థులు తమ సమాధానాలను సరిచూసుకుని స్కోర్‌ను అంచనా వేయడానికి వీలుగా కీ పేపర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రం PDFను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో మూడు పేపర్‌లు ఉండగా ఒక్కో పేపర్ 150 మార్కులు. మొత్తంగా 450 మార్కులుంటాయి. ఇక అభ్యర్థులు TSPSC గ్రూప్-3 రిజల్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. పరీక్ష ఫలితాలను చూడొచ్చు. ముందుగా మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి పోర్టల్‌లోకి లాగిన్ కాగానే మీ ఫలితాలు వెల్లడవుతాయి. 

ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులకు మరో షాక్.. అతి పెద్ద స్మారక స్థూపం ధ్వంసం!

అవరోహణ క్రమంలోనే నియామకాలు..

మరోవైపు.. గ్రూప్స్‌ పరీక్షల ఫలితాలు, పోస్టుల భర్తీని అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్‌-1 పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకూ జరగగా.. గ్రూప్‌-3 నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించారు. ఇక గ్రూప్-2 పరీక్షలు మాత్రం డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగాయి. అయితే ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం ఈ వరుసలో కాకుండా అవరోహణ క్రమంలోనే చేపట్టేందుకు కమిషన్‌ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొదటగా గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసి, పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన తర్వాతే గ్రూప్‌-2 ఫలితాలు విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఈ రెండు పోస్టుల భర్తీ ఆధారంగా గ్రూప్‌-3 ఫలితాలు విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయనుంది. మెరిట్‌ నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు