/rtv/media/media_files/2025/06/11/ijOrnf0a8pTGeCfLvIh4.jpg)
TG News: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం, అధికారులు, టీచర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో గతేడాది కంటే ఈసారి మరో 50 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం సగటున 2 లక్షల మంది కొత్త విద్యార్థులు చేరుతుంటారు. కానీ ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యా శాఖ సెక్రెటరీ యోగితా రాణా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మరిన్ని అడ్మిషన్లు పెరిగాయని, వచ్చే సంవత్సరం మరింత మంది ప్రభుత్వ బడిలో చేరేలా చర్యలు చేపడతామని తెలిపారు.
Also Read: త్వరలోనే డిజిటల్ హైవే.. రూల్స్ అతిక్రమిస్తే జేబులకి చిల్లే!
ఈ మేరకు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలతో ప్రచారం చేశారు. ఆటోలకు మైక్లు బిగించి ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేశారు. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లే కంటే ముందే టీచర్లు వారి ఇళ్లకు వెళ్లి స్కూల్ వయస్సుకు వచ్చిన పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు. బడులు తెరిచిన రోజునే కొత్త డ్రెస్సులు, పుస్తకాలు అందిస్తామని వివరించారు. దీంతో ఈసారి ఆశించిన స్థాయిలో కొత్త అడ్మిషన్లు వచ్చాయి. స్థానికంగా పని చేస్తోన్న టీచర్లను సమీప బడులకు డిప్యూటేషన్పై పంపించారు. అధికారులు గ్రామ స్థాయి నేతల సహకారం తీసుకుని 140 స్కూళ్లను రీఓపెన్ చేయించారు. దీంతో ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు వచ్చాయి. ఆయా స్కూళ్లకు కావాల్సిన మౌలిక వసతులు, రిపేర్ల కోసం ఒక్కో బడికి రూ.2 లక్షలు కేటాయించారు. ఆ పనులను జిల్లా కలెక్టర్లే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: త్వరలోనే డిజిటల్ హైవే.. రూల్స్ అతిక్రమిస్తే జేబులకి చిల్లే!
ఈ ఏడాది 118 మంది ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించారు. మిగతా టీచర్లు సైతం తమ పిల్లలను సర్కారు బడులకు పంపేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది. ఇక రాష్ట్రంలో 26,287 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రన్నింగ్లో ఉన్నాయి. కొన్నేళ్లుగా సుమారు 1,000 స్కూళ్లలో జీరో అడ్మిషన్లు నమోదు కావడంతో వాటికి తాళాలేశారు. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. సూక్ష్మ స్థాయి సమస్యలను సైతం అడిగి తెలుసుకుంటున్నారు.