డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1.17 లక్షల జీతం!

కర్ణాటక బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ, పీజీ డిగ్రీ, లాడిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 10 చివరితేదీగా వెల్లడించారు.

New Update
bank jobs

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదరుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంగళూరు ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్‌రంగ కర్ణాటక బ్యాంక్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస

పూర్తి వివరాలు

అర్హత: డిగ్రీ లేదా పీజీ డిగ్రీ లేదా లా డిగ్రీ లేదా సీఏ/సీఎస్/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  

వయోపరిమితి: 01-11-2024 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు వయోసడలింపు ఉంది.

Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష కేంద్రాలు: చెన్నై, బెంగళూరు, మంగళూరు, న్యూఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, పుణే, కోల్‌కతా, ధర్వాడ్/హుబ్లీ, మైసూరు, శివమొగ్గ, కలబుర్గీలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్

జీతం: నెలకు రూ. 48,480 నుంచి రూ.1,17,000 వరకు జీతం ఇవ్వనున్నారు.

సర్వీసు బాండ్: ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కంపెనీలో కనీసం 3 ఏళ్ల పాటు పనిచేసేందుకు సర్వీసు బాండ్ సమర్పించాలి. అదే సమయంలో విఫలమైనవారు అపాయింట్‌మెంట్ లెటర్‌లో సూచించిన విధంగా లిక్విడేటెడ్ నష్టాలను చెల్లించాలి. 

Also Read: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్..

దరఖాస్తుకు చివరితేది: ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 30న ప్రారంభంకాగా.. డిసెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

రాతపరీక్ష తేదీ: 22-12-2024న ఉంటుంది.

పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

Advertisment
తాజా కథనాలు