JEE Main result : జేఈఈ 2025 మెయిన్స్ సెకండ్ సెషన్ ఫలితాల తేదీ ప్రకటించిన NTA

జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలను ఏప్రిల్ 19న ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఏప్రిల్ 17న విడుదల చేస్తామని ప్రకటించగా అది కుదరలేదు. ఏప్రిల్ 18న ఫైనల్ కీ ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.

New Update
 results

JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఫలితాల విడుదల తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. మొదట ఏప్రిల్ 17న ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన NTA తర్వాత రిజల్ట్స్ విడుదల తేదీని మార్చింది. ఏప్రిల్ 18 (ఈరోజు) 2 గంటలకు మెయిన్స్ కీ విడుదల చేసింది. ఏప్రిల్ 19న రిజల్స్ ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలు చూసుకోవచ్చు. 2025 జనవరిలో జేఈఈ మెయిన్స్ సెషన్‌ 1 ఎగ్జామ్స్ జరిగాయి. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు సెషన్‌ 2 పరీక్షలు జరిగాయి.

Also read: PM speaks to Elon Musk : ఎలన్ మస్క్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?

Also read: Maoist: ఛత్తీస్‌గడ్‌లో 22 మంది మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్

అప్పుడే జేఈఈ అడ్వాస్

ఫైనల్‌ ఆన్సర్‌ కీ, స్కోర్‌ కార్డ్‌ చెక్‌ చేసుకోవడానికి అధికారిక వెస్‌సైట్ ఓపెన్ చేయండి. కేటగిరీల వారీగా కటాఫ్‌ స్కోర్‌ నిర్ణయించి ర్యాంకులు ప్రకటిస్తారు. సెషన్‌ 1, సెషన్‌ 2 కలిపి బెస్ట్ స్కోర్‌ సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షకు అర్హులుగా ప్రకటిస్తారు. ఏప్రిల్‌ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు