/rtv/media/media_files/2025/04/18/TZc0PRXyCvUD4hA0gZUv.jpg)
JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఫలితాల విడుదల తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. మొదట ఏప్రిల్ 17న ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన NTA తర్వాత రిజల్ట్స్ విడుదల తేదీని మార్చింది. ఏప్రిల్ 18 (ఈరోజు) 2 గంటలకు మెయిన్స్ కీ విడుదల చేసింది. ఏప్రిల్ 19న రిజల్స్ ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలు చూసుకోవచ్చు. 2025 జనవరిలో జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఎగ్జామ్స్ జరిగాయి. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు సెషన్ 2 పరీక్షలు జరిగాయి.
Also read: PM speaks to Elon Musk : ఎలన్ మస్క్కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?
The Final Answer Keys of JEE (Main) 2025 Session-II will be available for download on the JEE(Main) website by 2 PM today, i.e. on 18th April, 2025.
— National Testing Agency (@NTA_Exams) April 18, 2025
The result of JEE(Main) 2025 will be declared latest by 19.4.2025.
This is for information to all candidates.
Also read: Maoist: ఛత్తీస్గడ్లో 22 మంది మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్
అప్పుడే జేఈఈ అడ్వాస్
ఫైనల్ ఆన్సర్ కీ, స్కోర్ కార్డ్ చెక్ చేసుకోవడానికి అధికారిక వెస్సైట్ ఓపెన్ చేయండి. కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్ నిర్ణయించి ర్యాంకులు ప్రకటిస్తారు. సెషన్ 1, సెషన్ 2 కలిపి బెస్ట్ స్కోర్ సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు అర్హులుగా ప్రకటిస్తారు. ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.