Delhi : ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) కు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇటీవల సీబీఐ(CBI) ఇచ్చిన నోటీసుల ప్రకారం కవిత సోమవారం సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె విచారణకు రాలేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో న్యాయవిచారణకు దిగిన సీబీఐ అధికారులు.. లీగల్ అడ్వైస్(Legal Advice) తీసుకొని తదుపరి కార్యాచరణకు దిగాలని భావిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ తో రాజకీయంగా ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను ఈడీ విచారణ పేరుతో హడావుడి చేస్తే.. మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ఇప్పుడు సీబీఐ నోటీసులతో హడావుడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
పూర్తిగా చదవండి..Liquor Scam : కవితకు మరో బిగ్ షాక్.. న్యాయవిచారణకు దిగిన సీబీఐ!?
లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం విచారణకు హాజరు కావాల్సిన కవిత రాలేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో న్యాయవిచారణకు దిగిన సీబీఐ లీగల్ అడ్వైస్ మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టబోతున్నట్లు సమాచారం.
Translate this News: