Andhra Pradesh: కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు

జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను జగన్‌ కలిశారని..షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితే వైసీపీని విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Andhra Pradesh: కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు
New Update

అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో దీనిపై చర్చలు జరిపారని తెలిపారు. షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితే వైసీపీని విలీనం చేస్తానని జగన్ అన్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ ఆరోపణలపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మళ్లీ గెలిచేవరకు జగన్‌ తాడేపల్లిలోనే ఉంటారని.. ఆయన ఎవరికీ భయపడే రకం కాదని పేర్ని నాని అన్నారు.

#ex-cm-jagan #telugu-news #ysrcp #ap-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి