IT Raids: హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ రైడ్స్ కలకలం.. ఈసారి టార్గెట్ ఎవరంటే హైదరాబాద్లోని పాతబస్తీలో కింగ్స్ ప్యాలెస్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్తో పాటు, పలువురు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. By B Aravind 25 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఐటీ రెయిడ్స్ జరగడం కలకలం రేపుతోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు ఉదయం పాతబస్తిలో బడా వ్యాపారులే టార్గెట్గా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కింగ్స్ ప్యాలెస్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్తో పాటు పాతబస్తీలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారు జామునే ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి. వీరంతా కొహినూర్, కింగ్స్ గ్రూప్స్ పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. Also read: ‘నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు’.. అంటూ కాంగ్రెస్ పై హరీష్ సెటైర్లు! ఈ నేపథ్యంలో వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. శాస్త్రి పురం , మలక్ పేటలో ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. తాండూరులోని దుర్గ హోటల్లో బస చేసిన కింగ్స్ గ్రూప్ యజనిని ఆ హోటల్ లోనే ఐటి అధికారులు ప్రశ్నించారు. ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు.. రెండు గంటల పాటు చేసిన సోదాల్లో పలు కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. Also Read: రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ ఎంతో మేలు.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు.. #telugu-news #it-raids #telangana-election-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి