AI City Of Hyderabad : సాంకేతిక రంగంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగం రోజురోజుకు దూసుకుపోతుంది. ఇక భవిష్యత్తు మొత్తం ఏఐ సాంకేతికత మీదే ఆధారపడి ఉంటుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏఐకి సంబంధించి ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోసం హైదరాబాద్(Hyderabad) లో 200 ఎకరాలు కేటాయించామని చెప్పారు. ఏఐ రాకతో సాఫ్ట్వేరు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. భవిష్యత్తులో ఈ రంగంలో ఎన్నో అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad : ఏఐ సిటీ కోసం హైదరాబాద్లో 200 ఎకరాలు కేటాయించాం: శ్రీధర్ బాబు
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీ కోసం హైదరాబాద్లో 200 ఎకరాలు కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భవిష్యత్తులో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని తెలిపారు. జులైలో ఏఐ సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు.
Translate this News: