Hyderabad : ఏఐ సిటీ కోసం హైదరాబాద్లో 200 ఎకరాలు కేటాయించాం: శ్రీధర్ బాబు
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీ కోసం హైదరాబాద్లో 200 ఎకరాలు కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భవిష్యత్తులో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని తెలిపారు. జులైలో ఏఐ సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు.