Telangana BJP Leaders to Join Congress: తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది? ఓవైపు ప్రధాని వరుస పర్యటనలలో బీజేపీ(Telangana) శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉప్పొంగుతుండగా.. మరోవైపు.. కీలక నేతలు ఆ పార్టీకి ముఖం చాటేస్తున్నారు? మరి వారెందుకిలా చేస్తున్నారు. ఏకంగా ప్రధానే వచ్చినా.. వారు మాత్రం కారరాలేదు. కారణం ఏమై ఉంటుంది. అలిగారా? లేక అసంతృప్తితో ఉన్నారా? అదీకాక.. వేరే పార్టీ వైపు చూస్తున్నారా? ఆ ముగ్గురు పరిస్థితి ఏంటి? ఇప్పుడిదే అంశంపై తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఒక్క బీజేపీలోనే కాదు.. స్టేట్ పొలిటికల్ సర్కిల్లోనూ ఇదే ప్రధాన అంశంగా మారింది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? బీజేపీలో అసలేం జరుగుతోంది? ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ మీకోసం..
పూర్తిగా చదవండి..Telangana Politics: ఆ ముగ్గురు మళ్లీ మిస్.. కాంగ్రెస్లోకి జంపేనా?
తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది? మొన్న మహబూబ్ నగర్ సభకు గైర్హాజరైన ఆ పార్టీ సీనియర్ నేతలు.. ఇవాళ ఇందూరులో జరిగిన సభకు కూడా డుమ్మా కొట్టారు. బీజేపీ సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, గడ్డం వివేక్ తో పాటు.. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా నేటి సభకు హాజరవలేదు.

Translate this News: