/rtv/media/media_files/2025/10/14/ship-war-2025-10-14-22-25-48.jpg)
అమెరికా, చైనాలు నువ్వంటే నువ్వని కొట్టుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్యనా వాణిజ్య యుద్ధం తారాస్థాకి చేరుకుంది. అరుదైన ఖనిజాల విషయంలో చైనాపై కోపం తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు ఆ దేశానికి వంద శాతం అదనపు సుంకాలను విధించారు. దీనికి చనా భగ్గున మండిపడింది. ఎవరితోనూ తగువులు పెట్టుకోవడం ఇష్టం లేదు. కానీ మా జోలికి వస్తే ఊరుకోము అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇరు దేశాల వాణిజ్య యుద్ధం సముద్రానికి పాకింది. వాణిజ్య నౌకలపై అమెరికా, చైనా దేశాలు ప్రత్యేక ఫీజులు ప్రకటంచాయి.
ఇరు దేశాల ఓడలపై ఫీజులు
అమెరికా యాజమాన్యం లేదా ఆ దేశ జెండా ఉన్న షిప్ అయినా సరే తమ ఆధీనంలో ఉన్న సముద్రంలోకి వస్తే ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తామంటూ చైనా ప్రకటించింది. దీనిలో కేవలం చైనా నిర్మించిన నౌకలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఇవే ఫీజులను మొదలుపెట్టింది. ఈరోజు నుంచి అవి అమల్లోకి వస్తాయని చెప్పింది.
China claims 'legitimate defense' on all US-linked ships
— RT (@RT_com) October 11, 2025
Beijing slaps 'special port fees on ships with US flag or control'
After 'US unilateral new port fees which severely harm Chinese companies' pic.twitter.com/0fpqp9MNFH
The trade dispute between the U.S. and China continues to unfold, with the two countries matching measures step for step.
— Schwab Network (@SchwabNetwork) October 14, 2025
China expanded its rare earth export restrictions. President Trump warned of “massive” tariffs on Chinese goods. The U.S. imposed new port fees on Chinese… pic.twitter.com/8j0wd6RELf
చర్చలకు సిద్ధమే..
అమెరికాపై చైనా కోపంతో రగిలిపోతోంది. తమపై వంద శాతం అదనపు సుంకాలను విధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టింది. ట్రంప్ నిర్ణయాలు తమ దేశాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయని అంది. చైనా దేశ ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. మామూలుగా తాము ఎవరితోనే గొడవలు పడము అని..కానీ ఇలాంటివి చేస్తే ఎంతకైనా తెగిస్తామని..చివర వరకు పోరాడతామని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని చెప్పింది. తాము ఇప్పటికీ చర్చలకు సిద్ధంగానే ఉన్నామని చైనా వాణిజ్య శాఖ తెలిపింది.