America:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న ఓ నిర్ణయం చరిత్ర సృష్టించింది. మరికొన్ని రోజుల్లో బైడెన్ పదవీ కాలం ముగుస్తుండడంతో ఒక్కరోజులోనే ఆయన 1500 మందికి పైగా క్షమాభిక్షపెట్టారు. ముఖ్యంగా గృహనిర్బంధంలో ఉంచిన 1500 మందికి శిక్షను తగ్గించారు.అహింసా నేరాలు చేసిన 39 మందికి క్షమాభిక్ష పెట్టారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఇంత మందికి క్షమాభిక్ష కల్పించడం ఇదే తొలిసారి. అయితే బైడెన్ 1500 మందికి ఒకేసారి క్షమాభిక్ష ప్రసాదించడానికి కారణం ఏంటని అంతా అనుకుంటున్నారు. Also Read: Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే! కరోనా సమయంలో రద్దీగా ఉండే జైళ్ల నుంచి అనేక మంది ఖైదీలను అమెరికా ప్రభుత్వం రిలీజ్ చేసింది. అప్పటికే వారిలో ఐదుగురిలో ఒకరికి కరోనా ఉన్నట్లు గుర్తించి ఏడాది పాటు గృహ నిర్బంధంలో ఉంచారు.గృహనిర్బంధంలో ఉన్న వారికి శిక్ష తగ్గించాలనుకున్న అధ్యక్షుడు బైడన్.. గురువారం ఒక్క రోజే అనేక మందికి శిక్ష తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. Also Read: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం ఆయన పదవీ కాలం ముగిసే లోపు మరింత మందికి శిక్షలు తగ్గించడంతో పాటు క్షమాభిక్షలు పెట్టానున్నారని సమాచారం. అయితే జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఉరిశిక్షలు అమలు చేసే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ నడుస్తుంది. బైడెన్ ఇప్పటి వరకు మొత్తం 122 మందికి శిక్ష తగ్గించగా.. మరో 21 మందికి క్షమాభిక్ష కల్పించారు. వీళ్లలో గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న వారితో పాటు స్వలింగ సంపర్కం నిబంధనలు ఉల్లంఘించినవారే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. Also Read: Manoj: అంతా వదిన వల్లనే–మంచు మనోజ్ అయితే 2020 ఎన్నికల ప్రచారాల్లో భాగంగా బైడెన్ ఉరిశిక్ష పడబోతున్ననేరస్థులను జైల్లో ఉండేలా చూస్తానంటూ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీల పరంగానే అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ ఫెడరల్ ఉరిశిక్షలను ఆపేశారు. దీంతో బైడెన్ యే ఉరిశిక్షలు నిలిపివేయించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. Also Read: NIA: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఎన్ఐఏ సోదాలు ఇవి మాత్రమే కాకుండా అక్రమ ఆయుధ కొనుగోళ్ల కేసులో నిందితుడైన బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్కు.. జోబైడెన్ క్షమాభిక్ష ప్రసాదించడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఈ నిర్ణయం తీసుకోగా.. అప్పటి నుంచి ఆయనపై ఒత్తిడి తీవ్రతరమైంది. నేరస్థులకు శిక్ష తగ్గించడమో లేక క్షమాభిక్ష ప్రసాదించడమో చేయాలని అంతా అడుగుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో జో బైడెన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అలాగే ముందు ముందు కూడా క్షమాభిక్ష పత్రాలను పరిశీలిస్తానని బైడెన్ పేర్కొన్నారు. ఇదంతా చూస్తుంటే పదవీ కాలం ముగి సేవరకు మరికొంత మందికి బైడెన్ శిక్షలు తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.