India-Pakistan Ceasefire: భారత్‌-పాక్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయి.. ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు.

New Update
WAR END

WAR END

India-Pakistan Ceasefire: అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామని తెలిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయంటూ ట్వీట్‌ చేశారు. అలాగే భారత్‌-పాకిస్థాన్‌కు అభినందనలు తెలిపారు. భారత్-పాకిస్థాన్ కూడా కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు తెలిపాయి. 

భారత్-పాక్ కాల్పుల విరమణ

ట్రంప్ పోస్టు చేసిన కొద్దిసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు స్పష్టం చేశారు. భారత్‌, పాకిస్థాన్ ప్రధానమంత్రులు మోదీ, షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, పాక్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ అసిమ్‌ మునీర్‌తో తాము మాట్లాడినట్లు పేర్కొన్నారు. 

telugu-news | national-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు