/rtv/media/media_files/2025/05/12/FmBNSz9R4BmHvsPnRxxk.jpg)
Ahmed Sharif Chaudhry
భారత్ కు చెందిన ఓ పైలట్ పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. తమ అధీనంలో ఇండియన్ పైలట్ ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ సమాచారాన్ని అందించారు. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ మాత్రమేనని ఆయన అన్నారు. బలూచిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్ కారణమని అహ్మద్ షరీఫ్ ఆరోపించారు.
ఇక పాకిస్తాన్ ఎప్పుడూ కాల్పుల విరమణ కోసం అభ్యర్థించలేదని.. భారత్ కాల్పుల విరమణకు ముందుగా పిలుపునిచ్చిందని ఆయన ఆరోపించారు. మే 6, 7 తేదీల్లో పాక్ పై దారుణమైన, పిరికితనంతో కూడిన దాడులు జరిగాయని అన్నారు. తర్వాత ఇండియా సీజ్ ఫైర్ కోసం అభ్యర్థించిందని.. తామ ప్రతిదాడులు చేశాకే మాట్లాడతామని చెప్పామన్నారు. మే10వ తేదీన సీజ్ ఫైర్ కు అంగీకరించామని పేర్కొన్నారు.
DG ISPR Lt Gen Ahmed Sharif Chaudhry denies reports of an Indian pilot in custody: “No pilot is in our custody—this is fake news and social media chatter.”
— Hi Pakistan (@hipakistanpk) May 11, 2025
Pakistan stands firm on facts amid digital propaganda.#DGISPR #PakistanArmy #FakeNewsAlert #HiPakistan pic.twitter.com/SPVfW0g2D9
భారత్ జరిపిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని అహ్మద్ షరీఫ్ చౌదరి అన్నారు. పాక్ పై, పాక్ పౌరులపై భారత్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చామన్నారు. ఇండియాలోని 26 సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు. ఢిల్లీ సహా ఇతర నగరాలకు డ్రోన్లు పంపామన్నారు. ఫయాజ్, నగ్రోటాలో బ్రహ్మోస్ క్షిపణి స్టోరేజీ ఫెసిలిటీని ధ్వంసం చేశామని.. S-400 క్షిపణి బ్యాటరీలను న్యూట్రలైజ్ చేశామని తెలిపారు.
Pakistan never requested for ceasefire: DG ISPR
— Anila Khawaja (@anilakhawaja) May 11, 2025
ISPR Director General Lieutenant General Ahmed Sharif Chaudhry, along with senior officers of the Pakistan Air Force and Navy, said in a press conference on Sunday that Pakistan has never requested a ceasefire. https://t.co/A4wjIZ3ccq
కాల్పుల విరమణను ఉల్లంఘించలేదు
పాకిస్థాన్ సైన్యం భారత్ తో కాల్పుల విరమణను ఉల్లంఘించలేదని అహ్మద్ షరీఫ్ చౌదరి అన్నారు. LOC వెంబడి సాయుధ దళాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని తాను 200 % కచ్చితంగా చెప్పగలనన్నారు. తమది ఒక ప్రొఫెషనల్ సైన్యమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని తెలిపారు. తమది శాంతిని కోరుకునే దేశమని వెల్లడించారు. కానీ దాడి జరిగితే మేం ప్రతిదాడి చేస్తామని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కాగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పాకిస్తాన్ భారీ నష్టాలను చవిచూసింది.
BSF Jawan | BSF Jawan In Pakistan