/rtv/media/media_files/2025/03/19/rNKPnFJW4dJqGsQl0hw0.jpg)
Sunita Williams Photograph: (Sunita Williams)
సునీతా విలియమ్స్, విల్మోర్ బోయింగ్ 9 నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. గతేడాది జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన వీరు కేవలం 8 ఎనిమిది రోజుల మిషన్కు మాత్రమే వెళ్లారు. కానీ సంకేతిక కారణాల వల్ల అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో నేడు ఆమె భూమిపైకి వచ్చారు. మరో ముగ్గురు వ్యోమగామలతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ 17 గంటల ప్రయాణం తర్వాత భూవాతావరణంలోకి సేఫ్గా ల్యాండ్ అయ్యారు.
ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్
ఇండియన్ కాలమానం ప్రకారం తెల్లవారు జామన 2.41 గంటలకు డ్రాగన్ క్యాప్సూల్ ప్రవేశించింది. గంటకు 116 మైళ్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా వచ్చింది. భూమికి దగ్గరగా వచ్చిన తర్వాత అందులోని పారాచ్యూట్లు ఒక్కొక్కటి తెరచుకున్నాయి. ఈ క్రమంలో తెల్లవారు జామున 3: 27 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్రంలో క్యాప్సూల్ దిగింది. అయితే సునీత విలియమ్స్ నెక్ట్స్ ప్లాన్ ఏంటని చాలా మంది భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?
సునీత విలియమ్స్ ప్లాన్ ఇదే..
20 ఏళ్ల క్రితం సునీత ఫెడరల్ మార్షల్ మైఖల్ జె విలియమ్స్ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కెరీర్ మొదట్లో హెలికాప్టర్ పైలట్లుగా పనిచేశారు. అయితే వీరికి సంతానం లేదు. అహ్మదాబాద్కు చెందిన ఓ బాలికను దత్తత తీసుకోవాలని గతంలోనే తెలిపారు. ఈసారి దత్తత తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వీరు రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. వీటితోనే ఎక్కువ సమయం గడుపుతారట. సో వీటితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!