Pakistan Earthquake: భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు‌పై 5.2 నమోదు - పరుగులు తీసిన ప్రజలు

పాకిస్తాన్‌లో నేడు భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3:54 గంటలకు ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.

New Update
Earthquake

Earthquake

పాకిస్తాన్‌లో నేడు భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:54 గంటలకు ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం పాకిస్తాన్ వాయువ్యంలో భూమికి 150 కిలోమీటర్ల లోతులో గుర్తించబడింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) భూకంపాన్ని ధృవీకరించింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని తెలిపింది.

Pakistan Earthquake

నిన్న రెండు భూకంపాలు

నిన్న పాకిస్తాన్‌లో రెండు భూకంపాలు సంభవించాయి. సాయంత్రం 6:53 నుండి 7 గంటల మధ్య రెండు భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. రెండవ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైంది. కరాచీ నగరంలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. జూన్ 1 నుండి పాకిస్తాన్‌లో 21 భూకంపాలు సంభవించాయని కరాచీ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు