Delhi: ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన వంద నగరాల జాబితా-2024 తాజాగా విడుదలైంది. ఇందులో భారత్ నుంచి ఒకే ఒక్క నగరం ఈ జాబితాలో చేరింది. ఇక ఇప్పటికే గత 3 ఏళ్లుగా టాప్-1లో ఉన్న ఫ్రాన్స్ రాజధాని పారిస్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది.. వరుసగా నాలుగోసారి కూడా పారిస్ తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది. 1.7 కోట్ల మందికిపైగా ఇన్బౌండ్ అరైవల్స్తో మొదటి స్థానాన్ని పొందింది.
Also Read: INDIA : ఇండియా కూటమి చీఫ్గా మమతా బెనర్జీ
డాటా అనలిటిక్స్ కంపెనీ యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన తాజా రిపోర్ట్లో భారత్ నుంచి ఢిల్లీ.. 74వ స్థానంలో చోటు దక్కించుకుంది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్.. జపాన్ రాజధాని టోక్యో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ జాబితాలో టోక్యో తర్వాత.. సిడ్నీ, సింగపూర్, రోమ్, మిలన్, న్యూయార్క్, మ్యాడ్రిడ్, ఆమ్స్టర్డామ్, బార్సిలోనా నగరాలు నిలిచాయి.
Also Read: Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్ షో..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
ఇక 98వ స్థానంలో జెరూసలేం ఉండగా.. 99వ స్థానంలో జుహై, 100 స్థానంలో కైరో నగరాలు ఉన్నాయి. ఆర్థిక, వ్యాపార పనితీరు, పర్యాటక పనితీరు, పర్యాటక మౌలిక సదుపాయాలు, పర్యాటక విధానం, ఆకర్షణ, ఆరోగ్యం, భద్రత, స్థిరత్వం సహా 55 రకాల అంశాల ఆధారంగా ఈ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన నగరాలను సెలెక్ట్ చేశారు.
Also Read: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్..ఈ మార్గంలోనే తొలి రైలు!
ఈసారి విడుదల చేసిన రిపోర్ట్లో యూరోపియన్యేతర నగరాల్లో పెరుగుదల కనిపించింది. ఇందులో యూరప్ అగ్రస్థానంలో ఉందని ఆ నివేదిక వెల్లడించింది. మొదటి 20 నగరాల్లో 9 సిటీలతో యూరప్.. ఆ తర్వాత 6 నగరాలతో ఆసియా-పసిఫిక్ ప్రాంతం రెండో స్థానంలో ఉండగా.. తర్వాత ఉత్తర అమెరికాలో 2.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో ఒకటి.. ఆస్ట్రేలియాలో 2 నగరాలు నిలిచాయి. ఇక న్యూయార్క్ నగరం ఆరో స్థానంలో నిలిచింది.
Also Read: Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!
ఇక పర్యాటక డిమాండ్ కారణంగా 2024లో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వచ్చేవారి సంఖ్య 19 శాతం పెరిగినట్లు సమాచారం. 80 కోట్ల మంది అంతర్జాతీయ పర్యటనలతో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రాంతంగా యూరప్ రికార్డులు సృష్టించింది. మరోవైపు.. 2024లో 3.2 కోట్ల మంది సందర్శనలను ఆకర్షించిన బ్యాంకాక్ అంతర్జాతీయ రాకపోకల్లో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2024లో 30శాతం కంటే ఎక్కువ పెరుగుదలతో వృద్ధిని సాధించింది.