/rtv/media/media_files/2025/05/05/7mYSzmQIqZha0deDQi0f.jpg)
un António Guterres
భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ వెల్లడించారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. పహల్గామ్ దాడి తర్వాత భావోద్వేగాలను తాము అర్థం చేసుకోగలమని, పొరపాట్లు చేయొద్దని..దీనికి సైనిక చర్య పరిష్కారం కాదని తెలిపారు. ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా తాము సహకరిస్తామని చెప్పుకొచ్చారు. పహల్గామ్ దాడిని తాను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఆయన బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు.
❗️🇮🇳⚔️🇵🇰 - UN Secretary-General António Guterres, in a press statement at UN Headquarters, strongly condemned the Pahalgam terror attack in Kashmir, emphasizing that a military approach is not a viable solution.
— 🔥🗞The Informant (@theinformant_x) May 5, 2025
He urged both India and Pakistan to take immediate steps to… pic.twitter.com/M2WYWIFgSJ
రాష్ట్రాలకు కేంద్రం కీలక ప్రకటన
మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్లు నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రీల్ నిర్వహించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, శత్రు దేశాలు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఎలా వ్యవహరించాలి, స్వీయ రక్షణపై విద్యార్థులు, పౌరులకు అవగాహన కల్పించాలి లాంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించింది. హోం శాఖ అదేశాలను బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా పాక్ తో వార్ ఉండవచ్చునని తెలుస్తోంది. కాగా ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు చంపడంతో దీని వెనుక పాకిస్తాన్ ఉందని తేలడంతో దౌత్య సంబంధాలను భారత్ తెంచుకుంది.
Also Read : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...