చైనాలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్ట్ ప్రావిన్స్ షాన్డాంగ్లోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 500 మంది కార్మికులు ఉన్నారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. పేలుడు ధాటికి వేల కార్లు ధ్వంసమైయ్యాయి. పరిసర ప్రాంతాల్లో భవనాల అద్దాలు పగిలిపోయాయి.
పేలుడు తీవ్రతకి 5 కిలోమీటర్ల మేర పరిసర ప్రాంతాలు ప్రభావితమైయ్యాయి. వందల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారుల ప్రాథమిక అంచనాలో వెల్లడైంది. వందల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.