/rtv/media/media_files/2025/05/27/RpHVGbnMqeRGBcz787oX.jpg)
Jyoti Malhotra secret chat with ISI agents
Jyoti Malhotra: పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ఫోన్లో 12GB డాటా డిలీట్ చేసినట్లు వెల్లడించారు. డాటా రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
ఈ మేరకు జ్యోతికి ఏమాత్రం భయం లేకుండా ఉగ్రవాదులతో పరిచయాలు పెంచుకుందని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సందర్శన సందర్భంగా ఆమె వాళ్లను కలిసినట్లు వెల్లడించారు. జ్యోతి పర్సనల్ డివైజ్లు ఫోన్లు, ల్యాప్ట్యాప్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇందులోని 12 జీబీ డాటా డిలీట్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ డాటాను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పాక్, చైనాలో పర్యటనలతో పాటు పాక్లో జరిగిన హైప్రొఫైల్ ఈవెంట్లకు ఆమె హాజరైనట్లు గుర్తించారు. కేవలం 4 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఆమె విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, గన్మెన్లతో వీవీఐపీ ట్రీట్మెంట్ పొందిన అంశాన్ని పరిశీలిస్తున్నారు. డిలీట్ చేసిన డాటాలో కీలక సమాచారం ఉంటే జ్యోతికి మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉంది.
JYOTHI MALHOTRA | telugu-news