/rtv/media/media_files/2024/10/19/yZXEzRDdv1FeAOoEi6XV.jpg)
Australia: ఓ మహిళ తన భర్తను హత్య చేయడమే కాకుండా అతని శరీరాన్ని 30 భాగాలుగా కోసి 30 ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి వివిధ ప్రాంతాల్లో విసిరేసింది. సిడ్నీలో 53 ఏళ్ల ఆస్ట్రేలియా మహిళ నిర్మిన్ నుఫాల్ అనే మహిళ తన 62 ఏళ్ల భర్త మమ్దౌహ్ ఇమాద్ ను హత్య చేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 2023 మే 3వ తేదీన పశ్చిమ సిడ్నీలోని గ్రీన్కర్ హోమ్లో భార్య నౌఫల్ తన భర్తను కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత రంపంతో శరీరాన్ని 30 ముక్కలుగా చేసిందని పోలీసులు చెప్పారు.
Also Read: Big Breaking: భారీ ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి!
హత్యానంతరం భార్య తన భర్త శరీర భాగాలను 30 ప్లాస్టిక్ సంచులలో ఉంచి, వాటిని వివిధ ప్రదేశాలలో డస్ట్బిన్లలో పడేసిందని పోలీసులు తెలిపారు.దీని తరువాత భార్య నుఫాల్ను మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో పరీక్షించిన తర్వాత గత నెలలో అరెస్టు చేశారు. అయితే, ఆమె భర్త మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. గతేడాది తమ ఇంట్లోనే నౌఫల్ తన భర్తను ఉద్దేశపూర్వకంగా చంపినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు చెప్పారు.
Also Read: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా నిషేధం.. మస్క్ విమర్శలు ఖండించిన ప్రధాని
ఈ కేసు విచారణలో భార్య హత్య చేయడంతో భర్త హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో అతని కోసం స్నేహితులు వెదకడం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు మిస్సింగ్పై ఫిర్యాదు చేశారు. మేలో అతను అదృశ్యమైన తర్వాత, సిడ్నీ పశ్చిమ ప్రాంతంలోని గ్రీన్కర్ లోని జూనో పరేడ్లో అతని ఇంటికి పోలీసులు వచ్చారు.ఈ కేసుపై తాజాగా న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Also Read: హైదరాబాద్ లో ఘోర ప్రమాదం .. భర్త, నిండు గర్భవతి అక్కడిక్కడే మృతి!
నిర్మీన్ నౌఫల్కు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. వ్యక్తిగత కారణాల వల్లే భార్య నుఫాల్ తన భర్తను హత్య చేసిందని ఈ కేసులో లాయర్ చెప్పారు. నుఫాల్ తన భర్తతో సంతోషంగా లేకపోవడం వల్లే ఈ బంధం నుంచి తప్పించుకోవాలనుకుంటుందని లాయర్ చెప్పారు.
Also Read: Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు డాక్టర్లు స్పాట్ లోనే మృతి!
మే నెలలో ఈజిప్టులో ఆస్తిని సొంతం చేసుకునేందుకు భర్త నుండి భార్యకు చట్టపరమైన అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు లాయర్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్తను చంపిన తర్వాత నుఫాల్ ఈజిప్టుకు వెళ్లిపోయింది. అక్కడ ఆమె తన భర్త భూములను రూ. 1 కోటి 70 లక్షల విలువచేసే ఆస్తులను విక్రయించి, ఆపై ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిందని విచారణలో తెలిసింది. ప్రస్తుతం నుఫాల్ మానసిక అనారోగ్యంతో సహా అనేక వ్యాధులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ అంశంపై తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 11కు వాయిదా వేసింది.