Pak: ప్రియుడి కోసం 13 మంది కుటుంబ సభ్యులను చంపేసిన బాలిక!

పాక్‌ లోని సింధ్‌ ప్రావిన్స్‌ లో ఓ బాలిక తన ప్రేమకు అంగీకారం తెలపలేదని 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. కుటుంబం మొత్తానికి గోధుమల్లో విషయం కలిపి చంపేసింది.

New Update
poison

Poison: ప్రేమించిన వాడి కోసం తన కుటుంబం మొత్తాన్ని విషమిచ్చి చంపింది ఓ బాలిక. పాక్‌ లోని సింధ్‌ ప్రావిన్స్‌ లో నివసించే బాలిక ఓ యువకున్ని ప్రేమించింది. దానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.  దీంతో ప్రియుడితో కలిసి కుటుంబంలోని 13 మందికి విషమిచ్చి కడతేర్చింది.

Also Read:  షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ మరణాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అమ్మాయికి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబసభ్యులు అనుమతించకపోవడంతో బాలిక ఆగ్రహంతో ఈ ఘాతకానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె తన ప్రేమికుడితో కలిసి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేందుకు కుట్ర పన్నిందని పోలీసులు చెప్పారు.

Also Read: జానీ మాస్టర్‌కు మరో బిగ్‌ షాక్‌!

ఖైర్‌పూర్ సీనియర్ పోలీసు అధికారి ఇనాయత్ షా ఈ విషయం గురించి మీడియాకి తెలియజేస్తూ.. విషం కలిపిన ఆహారం తిన్న తర్వాత, మొత్తం 13 మంది సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. 

Also Read: విమానాశ్రయం వద్ద పేలుడు..ఇద్దరు మృతి!

దాంతో వారందరిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వారంతా కూడా మరణించారు. వారందరికి పోస్టుమార్టం చేయగా.. విషపూరిత ఆహారం వల్లే మృతి చెందినట్లు తెలిసింది.దీంతో పోలీసులు ఈ కేసు గురించి విచారించగా, ఆ అమ్మాయి, ఆమె ప్రేమికుడు ఇంట్లో బ్రెడ్ చేయడానికి ఉపయోగించే గోధుమలలో విషం కలిపినట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. అమ్మాయికి నచ్చిన అబ్బాయితో పెళ్లి ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.

Also Read: 'పవన్ కళ్యాణ్‌కు ఇది చెప్పాలనుకుంటున్నా'? షాయాజీ షిండే కామెంట్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు