మరో యుద్ధం.. దక్షిణ కొరియా Vs ఉత్తర కొరియా.. వీరి వివాదానికి కారణమిదే!

ఉత్తర కొరియా గురువారం తమపై క్షిపణి దాడులకు దిగిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ఈ రెండు దేశాల మధ్య వైరం ఇప్పటిది కాదు. 1945లో నార్త్​ కొరియా, సౌత్​ కొరియాలు విడిపోయాయి. రెండింటికి వేరువేరు ప్రభుత్వాలు వచ్చాయి. 

New Update
North Korea and South Korea

ఉత్తర కొరియా గురువారం తమపై క్షిపణి దాడులకు దిగిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ఈ రెండు దేశాల మధ్య వైరం ఇప్పటిది కాదు. ఇటీవల ఇరాన్ ఇజ్రాయిల్, రష్యా ఉక్రెయిన్, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇప్పుడు తాజాగా ఉత్తర, దక్షిణ కొరియాలు కూడా అదే బాటలోకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య రెండవ ప్రపంచ యుద్ధం నాటి పగ ఇప్పటికీ రగులుతోంది. రెండో ప్రపంచ యుద్ధం ముందు వరకు కొరియా మొత్తాన్ని జపాన్ పాలించేది. ఆ యుద్ధంలో జపాన్​ఓడిపోవడంతో USSR(ఇప్పటి రష్యా)​, అమెరికాలు కొరియాపై కన్నేశాయి. 

అమెరికా, USSR కారణంగానే

నార్త్​ భాగంలో USSR​ చురుకుగా ఉండగా.. సౌత్‌లో అమెరికా చూసుకునేది. అయితే, అడ్మినిస్ట్రేషన్​ విషయంలో రెండు దేశాలు ఒక ఒప్పందం కుదుర్చుకోలేకపోయాయి. ఫలితంగా 1945లో నార్త్​ కొరియా, సౌత్​ కొరియాలు విడిపోయాయి. రెండింటికి వేరువేరు ప్రభుత్వాలు వచ్చాయి. 

రెండు ప్రభుత్వాలు

అమెరికా కొరియా ద్వీపానికి దక్షిణ భాగాన్ని సైగ్మన్​ రీకి ఇచ్చింది. అలా ఆయన సౌత్​ కొరియాకు మొదటి అధ్యక్షుడు అయ్యారు. ఇక నార్త్​ కొరియాను కిమ్​ 2 సుంగ్​ చేతుల్లో పెట్టింది USSR. ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా​ తరపున పోరాడారు. అలా కిమ్​ కుటుంబం చేతుల్లోకి నార్త్​ కొరియా వెళ్లింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత నియంత పాలకుడిగా ఉన్న కిమ్​ జోంగ్​ఉన్ అదే ఫ్యామిలీకి చెందిన వాడు. నియంత పాలనతో అటు నార్త్​ కొరియా ప్రజలను, అణ్వాయుధ బెదిరింపులతో ఇటు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నారు కిమ్​. 1950లో సౌత్​ కొరియాపై కిమ్​ 2 సుంగ్​ యుద్ధం చేశారు. కొరియా మొత్తాన్ని కలిపేందుకు ప్రయత్నించారు. కానీ ఫెయిల్ అయ్యారు. కిమ్​మరణం తర్వాత ఆయన కుమారుడు కిమ్​జోంగ్​ఇల్​నార్త్​ కొరియాను పాలించారు. ఆయన మరణం తర్వాత కిమ్​జోంగ్​ఉన్​కి అధికారులు వచ్చాయి.

కొరియా యుద్ధం 1950 - 53

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వివాదాలు చాలా కాలంగా ఉన్నాయి. ప్రధానంగా కొరియా యుద్ధం, అప్పటి నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా. ఈ రెండు దేశాలు తమను తాము కొరియాకు ఏకైక చట్టబద్ధమైన ప్రభుత్వంగా చెప్పుకుంటున్నాయి. రెండు దేశాలకు మధ్య గొడవలకు ఇదే మూల కారణం. 1950-- 53 మధ్య జరిగిన కొరియా యుద్ధం ఉత్తర కొరియా సోవియట్ మద్దతుతో దక్షిణ కొరియాపై దాడి చేయడంతో ప్రారంభమైంది. ఈ యుద్ధం మూడు సంవత్సరాల పాటు కొనసాగింది. మిలియన్ల మంది మరణించారు. యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా ముగిసింది. కానీ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరలేదు. 

కొరియా దేశాల వైరానికి కారణాలు

ఉత్తర కొరియా అణు కార్యక్రమం, క్షిపణి పరీక్షలు దక్షిణ కొరియాతోపాటు ఇతర దేశాలకు వివాదాలకు ప్రధాన కారణం. ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. దక్షిణ కొరియాతో పాటు ఇతర దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహించే సైనిక విన్యాసాలు కూడా ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలకు దారితీస్తాయి. ఉత్తర కొరియాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలు కూడా ఆర్థిక, రాజకీయ వివాదాలకు కారణమవుతున్నాయి. 

ఉత్తర కొరియా తరచుగా స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇది దక్షిణ కొరియా, ఇతర దేశాలలో ఆందోళనలను కలిగిస్తుంది. అధికారిక వర్గాల ప్రకారం.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య శాంతి చర్చలు చాలా కాలంగా స్తంభించిపోయాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాను ప్రధాన శత్రువుగా పేర్కొంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలలో మరింత క్షీణతకు దారితీస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు